Telugu Global
NEWS

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.... మరో నిందితుడికి నార్కో పరీక్షలు..!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడైన కిరాయి హంతకుడు శేఖర్ రెడ్డిని నిన్న పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అతడిని పోలీసులు పలు ప్రశ్నలు అడిగినా… ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. దీంతో  శేఖర్ రెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ రోజు పులివెందుల కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం తమ నిర్ణయాన్ని సాయంత్రం వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే […]

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.... మరో నిందితుడికి నార్కో పరీక్షలు..!
X

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడైన కిరాయి హంతకుడు శేఖర్ రెడ్డిని నిన్న పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అతడిని పోలీసులు పలు ప్రశ్నలు అడిగినా… ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు.

దీంతో శేఖర్ రెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ రోజు పులివెందుల కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం తమ నిర్ణయాన్ని సాయంత్రం వెల్లడించే అవకాశం ఉంది.

ఇప్పటికే వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మెన్ రంగయ్యకు నార్కో అనాలసిస్ పరీక్షలు చేయడానికి బుధవారం కోర్టు అనుమతి ఇచ్చింది.

దీంతో శేఖర్‌రెడ్డి విషయంలో కూడా సానుకూలంగా తీర్పు వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. శేఖర్ రెడ్డి వెల్లడించే సమాచారంతో కేసు దర్యాప్తు మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

First Published:  4 July 2019 3:43 AM GMT
Next Story