Telugu Global
NEWS

ఆ నలుగురు ఎంపీలపై కేశినేని నాని ఫైర్

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీ మారిన నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలపై ఫైర్ అయ్యారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరగడాన్ని ప్రస్తావిస్తూ నలుగురు రాజ్యసభ ఎంపీలను కేశినేని నాని ఫేస్ బుక్ లో టార్గెట్ చేశారు. ”మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి BJP లోకి వెళుతున్నామని బిల్డప్ ఇచ్చారు. కానీ, నిన్న బడ్జెట్ చూసాక ఈ రాష్ట్ర ప్రజలకు బాగా అర్ధమయ్యింది, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి BJP లో చేరారో లేక మిమ్మల్ని […]

ఆ నలుగురు ఎంపీలపై కేశినేని నాని ఫైర్
X

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీ మారిన నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలపై ఫైర్ అయ్యారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరగడాన్ని ప్రస్తావిస్తూ నలుగురు రాజ్యసభ ఎంపీలను కేశినేని నాని ఫేస్ బుక్ లో టార్గెట్ చేశారు.

”మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి BJP లోకి వెళుతున్నామని బిల్డప్ ఇచ్చారు. కానీ, నిన్న బడ్జెట్ చూసాక ఈ రాష్ట్ర ప్రజలకు బాగా అర్ధమయ్యింది, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి BJP లో చేరారో లేక మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోడానికి BJP లో చేరారో అని…” అంటూ కేశినేని నాని ఫైర్ అయ్యారు.

ఇటీవలే నలుగురు రాజ్యసభ టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌, టీజీ వెంకటేశ్‌, గరికపాటిలు టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ అయ్యారు.

అనర్హత వేటు పడుతుందేమోనని ఎదురుచూసిన వారిని నిరాశ కలిగిస్తూ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వారిని బీజేపీలో విలీనం చేశారు.

ఎందుకు బీజేపీలోకి చేరారని ప్రశ్నించినప్పుడు రాష్ట్రానికి మంచి చేయాలన్న ఉద్దేశంతోనే బీజేపీలో చేరామని నలుగురు ఎంపీలు చెప్పారు. కానీ కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరగడంతో నలుగురు రాజ్యసభ ఎంపీలు ఇరుకున పడ్డారు.

@YSChowdaryMP@CMRamesh_MP@TGVenkateshమీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి BJP లోకి వెళుతున్నామని బిల్డప్ ఇచ్చారు….

Posted by Kesineni Nani on Friday, 5 July 2019

First Published:  6 July 2019 12:44 AM GMT
Next Story