Telugu Global
Cinema & Entertainment

మహేష్ బాబు కోసం 'ప్రత్యేక రైలు'....

అనిల్ రావిపూడి దర్శకత్వం లో ప్రస్తుతం మహేష్ బాబు ఒక సినిమా చేస్తున్నారు. ‘సరిలేరు నీకెవరు’ అనే టైటిల్ తో రానున్న ఈ సినిమా కి సంబందించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ కాశ్మీర్ లో ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ షెడ్యూల్ ముగించుకొని వచ్చాక చిత్ర యూనిట్ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఇంకో షెడ్యూల్ ని ఆరంభించాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగా తదుపరి షెడ్యూల్ విషయమై ఇప్పటికే చిత్ర యూనిట్ అన్నపూర్ణ స్టూడియోస్ […]

మహేష్ బాబు కోసం ప్రత్యేక రైలు....
X

అనిల్ రావిపూడి దర్శకత్వం లో ప్రస్తుతం మహేష్ బాబు ఒక సినిమా చేస్తున్నారు. ‘సరిలేరు నీకెవరు’ అనే టైటిల్ తో రానున్న ఈ సినిమా కి సంబందించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ కాశ్మీర్ లో ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.

అయితే ఈ షెడ్యూల్ ముగించుకొని వచ్చాక చిత్ర యూనిట్ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఇంకో షెడ్యూల్ ని ఆరంభించాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగా తదుపరి షెడ్యూల్ విషయమై ఇప్పటికే చిత్ర యూనిట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక స్పెషల్ సెట్ ని డిసైన్ చేయిస్తున్నారట.

అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే ఒక ప్రత్యేకమైన రైలు ని ఈ షెడ్యూల్ కోసం తయారు చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సెట్ కి సంబందించిన పనులు వేగం గా జరుగుతున్నాయి.

ఈ రైలు బండి సెట్ లో సినిమా కి సంబందించిన కొన్ని కామెడీ సీన్లని షూట్ చేయనున్నారని తెలుస్తుంది. మహేష్ కాశ్మీర్ నుంచి ఆంధ్రా కి వస్తున్న సీన్ల ని కూడా ఈ రైలు లోనే తీయనున్నారట.

రష్మిక మందన్న ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. చాన్నాళ్ళకి విజయశాంతి ఈ సినిమాతో కంబాక్ చేయనున్నారు.

First Published:  6 July 2019 12:31 AM GMT
Next Story