Telugu Global
National

ఎంపీలకు మోడీ పాదయాత్ర ఛాలెంజ్‌

బీజేపీ ఎంపీలకు నరేంద్రమోడీ కీలక ఆదేశం జారీ చేశారు. ఎంపీలంతా నియోజక వర్గాల్లో పాదయాత్ర చేయాలని ఆదేశించారు. అది కూడా 150 కిలోమీటర్లకు తగ్గకూడదని చెప్పారు. గాంధీ జయంతి అక్టోబర్‌ 2న మొదలుపెట్టి… వల్లబాయ్‌ పటేల్‌ జయంతి 31వ తేదీ వరకు ఈ పాదయాత్రలు చేయాలని మోడీ సూచించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు మోదీ ఈ మేరకు దిశా నిర్దేశం చేశారు. ఈ పాదయాత్రల వల్ల గ్రామాల్లో పరిస్థితులు తెలుస్తాయని… అక్కడి సమస్యల పరిష్కారానికి […]

ఎంపీలకు మోడీ పాదయాత్ర ఛాలెంజ్‌
X

బీజేపీ ఎంపీలకు నరేంద్రమోడీ కీలక ఆదేశం జారీ చేశారు. ఎంపీలంతా నియోజక వర్గాల్లో పాదయాత్ర చేయాలని ఆదేశించారు. అది కూడా 150 కిలోమీటర్లకు తగ్గకూడదని చెప్పారు.

గాంధీ జయంతి అక్టోబర్‌ 2న మొదలుపెట్టి… వల్లబాయ్‌ పటేల్‌ జయంతి 31వ తేదీ వరకు ఈ పాదయాత్రలు చేయాలని మోడీ సూచించారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు మోదీ ఈ మేరకు దిశా నిర్దేశం చేశారు.

ఈ పాదయాత్రల వల్ల గ్రామాల్లో పరిస్థితులు తెలుస్తాయని… అక్కడి సమస్యల పరిష్కారానికి అవకాశం ఏర్పడుతుందని మోడీ అభిప్రాయపడ్డారు. పాదయాత్రలో మొక్కలు నాటడంతో పాటు ప్రభుత్వ పథకాలపై ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆదేశించారు.

First Published:  9 July 2019 10:42 PM GMT
Next Story