Telugu Global
Cinema & Entertainment

మైత్రి సంస్థ కష్టాలు.... ఎక్కడ మొదలైందో అక్కడికే వచ్చిది !

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా తో తెలుగు లో సినిమా నిర్మాణం లో కి అడుగు పెట్టారు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వాళ్ళు. ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. మొన్నా మధ్య సుకుమార్-మహేష్ బాబు తో ఒక సినిమా చేయాలి అనుకున్నారు నిర్మాతలు. కానీ అది వర్క్ అవుట్ అవ్వడం లేదు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మొదట్లోనే మహేష్ తో ఎన్టీఆర్ తో సినిమాలు చేసి తెలుగు లో […]

మైత్రి సంస్థ కష్టాలు.... ఎక్కడ మొదలైందో అక్కడికే వచ్చిది !
X

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా తో తెలుగు లో సినిమా నిర్మాణం లో కి అడుగు పెట్టారు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వాళ్ళు. ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. మొన్నా మధ్య సుకుమార్-మహేష్ బాబు తో ఒక సినిమా చేయాలి అనుకున్నారు నిర్మాతలు. కానీ అది వర్క్ అవుట్ అవ్వడం లేదు.

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మొదట్లోనే మహేష్ తో ఎన్టీఆర్ తో సినిమాలు చేసి తెలుగు లో పెద్ద నిర్మాణ సంస్థగా ఎదిగింది. అయితే ఆ తర్వాత వరుస పరాజయాల తో చతికిలపడింది.

అందుకే ఏ హీరోలు అయితే తమ సంస్థ కి పేరుని తీసుకొని వచ్చారో వాళ్ళతో మళ్ళీ సినిమాలు చేయాలనే నిర్ణయానికి వచ్చింది ఈ సంస్థ. అందుకే మహేష్ బాబు తో ఎలాగైనా సినిమా చేయాలని తరచూ నిర్మాతలు మహేష్ ని, నమ్రత ని కలుస్తున్నారట. ఆల్రెడీ ఎన్టీఆర్-కే.జీ.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమాను కన్ పార్మ్ చేశారు.

రామ్ చరణ్ తో రంగస్థలం చేసినప్పుడే చిరంజీవి తో సినిమా చేయాలని అనుకున్నారు. అందుకే ఇప్పుడు చిరంజీవి-త్రివిక్రమ్ సినిమా నిర్మించాలని చూస్తున్నారు.

అయితే ఎన్టీఆర్ సినిమా పైన క్లారిటీ ఉంది కానీ… మహేష్ బాబు, చిరంజీవి సినిమాలపై ఇంకా క్లారిటీ రాలేదు.

First Published:  13 July 2019 1:01 AM GMT
Next Story