Telugu Global
NEWS

కేశినేని నాని సంచలన ట్వీట్

విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి టీడీపీపై ఫైర్ అయ్యారు. బుద్దా వెంకన్నకు కూడా తగిలేలా ఒక ట్వీట్ పెట్టాడు నాని. ఈ ట్వీట్‌ వెనుక పెద్ద వ్యవహారమే ఉంది. ‘నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు, నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేనివాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు, ట్వీట్ చేస్తున్నాడు. దౌర్భాగ్యం!” అంటూ ట్వీట్ పెట్టారు కేశినేని నాని. ఈ ట్వీట్‌ బుద్దా వెంకన్నపై పెట్టారా? అన్న దానిపై చర్చ నడుస్తోంది. ఇటీవల విజయవాడ టీడీపీలో పెత్తనం […]

కేశినేని నాని సంచలన ట్వీట్
X

విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి టీడీపీపై ఫైర్ అయ్యారు. బుద్దా వెంకన్నకు కూడా తగిలేలా ఒక ట్వీట్ పెట్టాడు నాని. ఈ ట్వీట్‌ వెనుక పెద్ద వ్యవహారమే ఉంది.

‘నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు, నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేనివాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు, ట్వీట్ చేస్తున్నాడు. దౌర్భాగ్యం!” అంటూ ట్వీట్ పెట్టారు కేశినేని నాని.

ఈ ట్వీట్‌ బుద్దా వెంకన్నపై పెట్టారా? అన్న దానిపై చర్చ నడుస్తోంది. ఇటీవల విజయవాడ టీడీపీలో పెత్తనం చెలాయించేందుకు బుద్దా వెంకన్న ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆయనను ఉద్దేశించే ఈ ట్వీట్ పెట్టినట్టు భావిస్తున్నారు.

విజయవాడ పశ్చిమ సీటుతో పాటు, త్వరలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో కేశినేని, బుద్దా వెంకన్న పోటీ పడి పార్టీలో పట్టు కోసం ఎత్తులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని బుద్దా వెంకన్న భావిస్తుండగా… నాగూర్ మీరాను వచ్చే ఎన్నికల్లో పశ్చిమ ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నా అంటూ ఇటీవల కేశినేని నాని టీడీపీ నేతల సమావేశంలో వ్యాఖ్యానించారు.

అప్పటి నుంచి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. నగర టీడీపీ అధ్యక్ష పదవి, అధికార ప్రతినిధి పదవి, ఎమ్మెల్సీ పదవి, విప్ పదవిని బుద్దా వెంన్న సాధించినందుకే ఆయన్ను ఉద్దేశించే నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు… నాలుగు పదవులు సంపాదించాడని కేశినేని ట్వీట్ చేసినట్టు భావిస్తున్నారు.

First Published:  13 July 2019 10:59 PM GMT
Next Story