Telugu Global
National

కేంద్రం ఇచ్చిన 17 వేల కోట్ల రూపాయలను చంద్రబాబు మింగేశాడు

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులను మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన జేబులో వేసుకున్నారని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు విజయవాడ వచ్చిన శివరాజ్ సింగ్ చౌహాన్ విజయవాడలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. “ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 17 వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. ఆ […]

కేంద్రం ఇచ్చిన 17 వేల కోట్ల రూపాయలను చంద్రబాబు మింగేశాడు
X

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులను మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన జేబులో వేసుకున్నారని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు విజయవాడ వచ్చిన శివరాజ్ సింగ్ చౌహాన్ విజయవాడలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

“ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 17 వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. ఆ నిధులను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన జేబులో వేసుకున్నారు” అని మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ మేలు అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత మాట మార్చారని శివరాజ్ సింగ్ విమర్శించారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరినైనా మోసం చేసే చంద్రబాబు నాయుడికి కేంద్రాన్ని మోసం చేయడం పెద్ద విషయం కాదని మాజీ సీఎం విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని, చంద్రబాబు నాయుడు వంటి స్వార్థ రాజకీయ నాయకుల కారణంగా రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదని శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజులలో ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందని, తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా నూకలు చెల్లినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు అనేక మంది భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని, ఇక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చౌహాన్ చెప్పారు.

భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన శివరాజ్ సింగ్ చౌహాన్ విజయవాడలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయం సేవక్ సంఘ్ కు చెందిన పలువురు పెద్దల కాళ్లు కడిగారు. దేశం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు.

First Published:  14 July 2019 11:26 PM GMT
Next Story