Telugu Global
Cinema & Entertainment

'ఎవరు' టీజర్.... స్టోరీ మొత్తం ఆ హీరో చుట్టే తిరుగుతుందా?

ఈ మధ్యనే ‘గూడచారి’ అనే సినిమాతో ప్రేక్షకులకు ఒక మంచి థ్రిల్లర్ ను పరిచయం చేసిన అడవి శేష్ ఇప్పుడు ‘ఎవరు’ అనే మరొక ఆసక్తికరమైన థ్రిల్లర్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వెంకట్ రామ్ జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రెజినా హీరోయిన్ గా నటించింది. తాజాగా సమంత అక్కినేని ఈ చిత్ర టీజర్ ను లాంచ్ చేసింది. కేవలం నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోతో… సినిమా కథ ఎలా ఉండబోతోందో […]

ఎవరు టీజర్.... స్టోరీ మొత్తం ఆ హీరో చుట్టే తిరుగుతుందా?
X

ఈ మధ్యనే ‘గూడచారి’ అనే సినిమాతో ప్రేక్షకులకు ఒక మంచి థ్రిల్లర్ ను పరిచయం చేసిన అడవి శేష్ ఇప్పుడు ‘ఎవరు’ అనే మరొక ఆసక్తికరమైన థ్రిల్లర్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వెంకట్ రామ్ జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రెజినా హీరోయిన్ గా నటించింది.

తాజాగా సమంత అక్కినేని ఈ చిత్ర టీజర్ ను లాంచ్ చేసింది. కేవలం నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోతో… సినిమా కథ ఎలా ఉండబోతోందో కొన్ని హింట్స్ కూడా ఇచ్చారు. ఈ సినిమాలో అడవి శేష్…. విక్రమ్ వసుదేవ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

కథ ప్రకారం ఈ సినిమాలో నవీన్ చంద్ర హత్యకేసులో రెజీనాని అరెస్ట్ చేస్తారు. అయితే రెజీనా మాత్రం నవీన్ ఆమెను రేప్ చేయబోయాడు అని ఆరోపిస్తుంది. టీజర్ చూస్తే… అసలు నవీన్ చంద్రా ని హత్య చేసింది ‘ఎవరు’ అనే విషయంపై సినిమా నడుస్తుందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కాబోతోంది. గూడచారి సినిమాకి అద్భుతమైన ట్యూన్స్ అందించిన శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి కూడా సంగీతాన్ని అందిస్తున్నాడు.

First Published:  19 July 2019 8:10 PM GMT
Next Story