Telugu Global
National

బిగ్ బాస్ వివాదం... ఉచ్చు బిగుసుకుంటోంది...

బిగ్ బాస్.. తెలుగు రియాలిటీ షో.. గత రెండేళ్లుగా ఎంతో పాపులర్ అయిన షో. ఈ షో చుట్టూ ముసురుకున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. అయితే ఎంతో జనాదరణ ఉన్న ఈ షో చుట్టూ ఈసారి కూడా వివాదాలు చుట్టుముట్టాయి. ఆడిషన్స్ కోసం ఎంపిక చేయడానికి పిలిచిన ఇద్దరు మహిళలు…. శ్వేతారెడ్డి, గాయత్రిలు పోలీస్ స్టేషన్ గడప తొక్కారు. మహిళలమైన తమను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియా కెక్కారు. తాజాగా బిగ్ బాస్ […]

బిగ్ బాస్ వివాదం... ఉచ్చు బిగుసుకుంటోంది...
X

బిగ్ బాస్.. తెలుగు రియాలిటీ షో.. గత రెండేళ్లుగా ఎంతో పాపులర్ అయిన షో. ఈ షో చుట్టూ ముసురుకున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. అయితే ఎంతో జనాదరణ ఉన్న ఈ షో చుట్టూ ఈసారి కూడా వివాదాలు చుట్టుముట్టాయి.

ఆడిషన్స్ కోసం ఎంపిక చేయడానికి పిలిచిన ఇద్దరు మహిళలు…. శ్వేతారెడ్డి, గాయత్రిలు పోలీస్ స్టేషన్ గడప తొక్కారు. మహిళలమైన తమను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియా కెక్కారు.

తాజాగా బిగ్ బాస్ మొదలైంది. షోలో 15మంది సెలబ్రెటీలు చేరారు. షో ను హీరో నాగార్జున ఘనంగా లాంచ్ చేశాడు. అయితే ఈ షోపై వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు యాక్షన్ మొదలుపెట్టారు.

తాజాగా బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం స్టార్ మాకు నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. అంతేకాదు.. ఆ చానెల్ కు వెళ్లి నోటీసులు అందించి విచారణ జరిపినట్టు తెలుస్తోంది.

బిగ్ బాస్ షో నిర్వాహకులు శ్యాం, మరో ముగ్గురిని పోలీసులు విచారించినట్టు తెలిసింది. వీరు స్టార్ మా యాజమాన్యంతో మాట్లాడి రెండు రోజుల్లో సమాధానాలు ఇస్తామని తెలిపారని సమచారం. దీంతో వారు ఇచ్చే సమాధానాల ఆధారంగా నిర్వాహకులపై చర్యలు తీసుకునే అవకాశాలుంటాయి.

ఇక బిగ్ బాస్ షో పై హైకోర్టులో ఇప్పటికే కేసు నడుస్తోంది. ఇక ఇప్పుడు పోలీసుల విచారణ కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ కాంట్రావర్సీ పీక్ స్టేజ్ కు చేరుకోవడం విశేషం.

First Published:  24 July 2019 1:55 AM GMT
Next Story