Telugu Global
Cinema & Entertainment

మళ్ళీ నందమూరి హీరోల కలయిక !

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి తో ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో బిజీ గా ఉన్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ తరువాత ఏ సినిమా చేస్తాడు? అని అందరిలో ఆసక్తి ఉంది. ఇండస్ట్రీ నుంచి వస్తున్న వార్తల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ఒక సినిమా చేయనున్నాడట. ప్రశాంత్ నీల్ కె.జి.యఫ్ సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యాడు. అంతకు ముందు కూడా సినిమాలు చేసినా, కేవలం కన్నడ కి మాత్రమే […]

మళ్ళీ నందమూరి హీరోల కలయిక !
X

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి తో ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో బిజీ గా ఉన్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ తరువాత ఏ సినిమా చేస్తాడు? అని అందరిలో ఆసక్తి ఉంది.

ఇండస్ట్రీ నుంచి వస్తున్న వార్తల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ఒక సినిమా చేయనున్నాడట. ప్రశాంత్ నీల్ కె.జి.యఫ్ సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యాడు. అంతకు ముందు కూడా సినిమాలు చేసినా, కేవలం కన్నడ కి మాత్రమే పరిమితం అయ్యాడు ఈ దర్శకుడు.

ఇప్పుడు తాజాగా ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కి కథ వినిపించేందుకు సిద్ధం అవుతున్నాడట. అయితే ఈ సినిమా ని నిర్మించడానికి మైత్రి మూవీస్ సంస్థ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కూడా మైత్రి సంస్థత కూడా గతంలోనే వెల్లడించింది.

అయితే ఇప్పుడు ఈ సినిమా నిర్మాణంలో కళ్యాణ్ రామ్ కూడా భాగం కావాలని అనుకుంటున్నాడట. ఈ సినిమా తారక్ కి కచ్చితంగా ఒక ప్రత్యేకమైన సినిమా అవ్వనుంది. అందుకనే మైత్రి తో పాటు కళ్యాణ్ రామ్ కూడా చేతులు కలిపి తారక్ కెరీర్ లో ఒక మర్చిపోలేని సినిమా చేయాలనే దిశగా ఆలోచన చేస్తున్నాడట.

ఇంతకు ముందు తారక్ నటించిన జై లవ కుశ సినిమాను కూడా కళ్యాణ్ రామే నిర్మించాడు.

First Published:  25 July 2019 6:14 AM GMT
Next Story