Telugu Global
NEWS

భారత్ తో వన్డే సిరీస్ కు విండీస్ జట్టులో క్రిస్ గేల్

ఆగస్టు 8 నుంచి భారత్-విండీస్ వన్డే సిరీస్ వన్డే క్రికెట్ రెండో ర్యాంకర్ భారత్ తో ఆగస్టు 8 నుంచి 14 వరకూ జరిగే తీన్మార్ వన్డే సిరీస్ లో పాల్గొనే వెస్టిండీస్ జట్టులో సునామీ ఓపెనర్ క్రిస్ గేల్ కు చోటు దక్కింది. మొత్తం 14 మంది సభ్యుల కరీబియన్ జట్టు వివరాలను విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. జెయింట్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ నాయకత్వంలోని జట్టులో జాన్ కాంప్ బెల్, క్రిస్ గేల్, ఇవిన్ లూయిస్, […]

భారత్ తో వన్డే సిరీస్ కు విండీస్ జట్టులో క్రిస్ గేల్
X
  • ఆగస్టు 8 నుంచి భారత్-విండీస్ వన్డే సిరీస్

వన్డే క్రికెట్ రెండో ర్యాంకర్ భారత్ తో ఆగస్టు 8 నుంచి 14 వరకూ జరిగే తీన్మార్ వన్డే సిరీస్ లో పాల్గొనే వెస్టిండీస్ జట్టులో సునామీ ఓపెనర్ క్రిస్ గేల్ కు చోటు దక్కింది.

మొత్తం 14 మంది సభ్యుల కరీబియన్ జట్టు వివరాలను విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. జెయింట్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ నాయకత్వంలోని జట్టులో జాన్ కాంప్ బెల్, క్రిస్ గేల్, ఇవిన్ లూయిస్, షెర్మాన్ హెట్ మేయర్, నికోలస్ పూరన్, రోస్టన్ చేజ్, షై హోప్, ఫేబియన్ అలెన్, కార్లోస్ బ్రాత్ వెయిట్, కీమో పాల్, షెల్డన్ కోట్రెల్, ఓషన్ థామస్, కెమెర్ రోచ్ సభ్యులుగా ఉన్నారు.

తీన్మార్ సిరీస్ లోని తొలివన్డే గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా ఆగస్టు 8న జరుగుతుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లోని క్వీన్స్ పార్క్ స్టేడియంలో ఆగస్టు 11, 14 తేదీలలో రెండు, మూడు వన్డేలు నిర్వహిస్తారు.

First Published:  27 July 2019 1:38 AM GMT
Next Story