Telugu Global
NEWS

కమ్యూనిస్టులపై కేశినేని నాని శాపనార్థాలు

టీడీపీ నేతలను, వైసీపీ నేతలను టార్గెట్‌ చేసుకుని ట్వీట్లు చేస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పుడు కమ్యూనిస్టులపై పడ్డారు. కేశినేని నాని తమకు జీతాలు ఇవ్వకుండా మోసం చేయడంపై కేశినేని ట్రావెల్స్ కార్మికులు నిన్న విజయవాడలో దీక్షకు దిగారు. ఈ దీక్షకు కమ్యూనిస్టు నాయకులు మద్దతు పలికారు. కార్మికులతో పాటు దీక్షా శిబిరంలో కమ్యూనిస్టు నాయకులు కూర్చున్నారు. దీంతో కేశినేని నానికి కోపం వచ్చింది. ట్విట్టర్ వేదికగా కమ్యూనిస్టు నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టు […]

కమ్యూనిస్టులపై కేశినేని నాని శాపనార్థాలు
X

టీడీపీ నేతలను, వైసీపీ నేతలను టార్గెట్‌ చేసుకుని ట్వీట్లు చేస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పుడు కమ్యూనిస్టులపై పడ్డారు. కేశినేని నాని తమకు జీతాలు ఇవ్వకుండా మోసం చేయడంపై కేశినేని ట్రావెల్స్ కార్మికులు నిన్న విజయవాడలో దీక్షకు దిగారు. ఈ దీక్షకు కమ్యూనిస్టు నాయకులు మద్దతు పలికారు. కార్మికులతో పాటు దీక్షా శిబిరంలో కమ్యూనిస్టు నాయకులు కూర్చున్నారు. దీంతో కేశినేని నానికి కోపం వచ్చింది.

ట్విట్టర్ వేదికగా కమ్యూనిస్టు నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టు నాయకులు కిరాయి వ్యక్తులుగా మారిపోయారని విమర్శించారు. కమ్యూనిస్టు పార్టీలు కిరాయి పార్టీలుగా మారిపోవడం వల్లే దేశంలో కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగు అయ్యే పరిస్థితి వచ్చిందని శాపనార్థానాలు పెట్టారు.

కేశినేని నాని ట్వీట్‌పై విజయవాడ సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మండిపడ్డారు. కేశినేని నాని నోటి దూల తగ్గించుకుంటే మంచిదన్నారు. నాని బతుకేందో టీడీపీ నేత బుద్దా వెంకన్నే అందరికీ అర్థమయ్యేలా చెప్పారన్నారు. కేశినేని నానికి చిత్తశుద్ది ఉంటే కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

First Published:  27 July 2019 1:04 AM GMT
Next Story