Telugu Global
Cinema & Entertainment

మూడు భారీ సినిమాలతో.... 'మైత్రి'

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ సినిమాలను నిర్మిస్తూ తెలుగు సినిమా పరిశ్రమ లో టాప్ లో ఉంది. అయితే ఈ సంస్థ నుంచి వచ్చిన మొదటి సినిమా శ్రీమంతుడు. ఆ తర్వాత జనతా గారేజ్ తో పెద్ద హిట్ కొట్టారు. మధ్యలో కొంచెం ఒడిదుడుకులు ఎదురయినా కానీ సంస్థ నిలదొక్కుకొని ఇటీవలే విజయ్ దేవరకొండ తో డియర్ కామ్రేడ్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే ఈ […]

మూడు భారీ సినిమాలతో.... మైత్రి
X

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ సినిమాలను నిర్మిస్తూ తెలుగు సినిమా పరిశ్రమ లో టాప్ లో ఉంది. అయితే ఈ సంస్థ నుంచి వచ్చిన మొదటి సినిమా శ్రీమంతుడు. ఆ తర్వాత జనతా గారేజ్ తో పెద్ద హిట్ కొట్టారు. మధ్యలో కొంచెం ఒడిదుడుకులు ఎదురయినా కానీ సంస్థ నిలదొక్కుకొని ఇటీవలే విజయ్ దేవరకొండ తో డియర్ కామ్రేడ్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే ఈ నిర్మాణ సంస్థ ఇప్పుడు వరుసగా మూడు సినిమాలని లైన్ లో పెట్టింది. ఈ మూడూ భారీ సినిమాలే. వీటిని త్వరలో నే మొదలు పెట్టనున్నట్లు ఒక ప్రకటన కూడా జారీ చేసింది.

ఇందులో మొదటి సినిమా అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో రానుంది. రష్మిక ఈ సినిమా లో హీరోయిన్. ఈ ఏడాది చివరికల్లా ఈ సినిమా మొదలు కానుంది.

ఆ తర్వాతి చిత్రం మహేష్ బాబు తో ఉంటుందట… కానీ దర్శకుడు ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

ఇక మూడో చిత్రం అందరికీ తెలిసినట్టే జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఉంటుంది. ఈ సినిమా ఆర్ఆర్ఆర్ మరియు కెజిఫ్ 2 విడుదల అయ్యాక మొదలవుతుంది.

First Published:  30 July 2019 1:36 AM GMT
Next Story