Telugu Global
NEWS

అన్న క్యాంటీన్ల మూసివేతపై అసలు నిజం చెప్పిన విజయసాయి

వైసీపీ ప్రభుత్వం వచ్చాక గతంలో పాలించిన టీడీపీ అక్రమాలన్నింటిని బయటకు లాగుతోంది. అసెంబ్లీ సాక్షిగా ఎండగడుతోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అక్రమాలను ట్విట్టర్ సాక్షిగా లెక్కలతో బయటపెడుతూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కడిగిపారేస్తున్నారు. ఇప్పుడాయన వరుస ట్వీట్స్ టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా విజయసాయిరెడ్డి పోలవరం, అన్న క్యాంటీన్ల మూసివేతకు సంబంధించి సంచలన విషయాలు చెబుతూ ట్వీట్స్ చేశారు. ఇప్పుడివి చర్చనీయాంశంగా మారాయి. విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ.. 5 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తే ఏపీ సస్యశ్యామలం […]

అన్న క్యాంటీన్ల మూసివేతపై అసలు నిజం చెప్పిన విజయసాయి
X

వైసీపీ ప్రభుత్వం వచ్చాక గతంలో పాలించిన టీడీపీ అక్రమాలన్నింటిని బయటకు లాగుతోంది. అసెంబ్లీ సాక్షిగా ఎండగడుతోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అక్రమాలను ట్విట్టర్ సాక్షిగా లెక్కలతో బయటపెడుతూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కడిగిపారేస్తున్నారు. ఇప్పుడాయన వరుస ట్వీట్స్ టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

తాజాగా విజయసాయిరెడ్డి పోలవరం, అన్న క్యాంటీన్ల మూసివేతకు సంబంధించి సంచలన విషయాలు చెబుతూ ట్వీట్స్ చేశారు. ఇప్పుడివి చర్చనీయాంశంగా మారాయి.

విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ.. 5 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తే ఏపీ సస్యశ్యామలం అయ్యేదని.. ఇప్పుడు 60 టీఎంసీలు వృథాగా సముద్రం పాలవుతున్నాయని విమర్శించారు. పోలవరం పేరుతో దోచుకోవడంలో ఉన్న చిత్తశుద్ధి పూర్తి చేయడంలో చంద్రబాబుకు లేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు.

ఇక అన్న క్యాంటీన్లపై కూడా విజయసాయిరెడ్డి సంచలన నిజాలు చెప్పుకొచ్చారు. కేవలం 2 లక్షలతో నిర్మించే అన్న క్యాంటీన్లను ఎన్నికలకు ముందుర ఆదరబాదరగా ఒక్కోటి 30-50 లక్షలు ఖర్చయ్యిందని లెక్కలు చూపి టీడీపీ నేతలు దోచుకున్నారని.. ఇందులో 150 కోట్ల స్కాం జరిగిందని.. అది వెలికితీసేందుకు ఈ క్యాంటీన్లను మూసివేశామని.. నిజాలు తేల్చి ప్రారంభిస్తామని విజయసాయిరెడ్డి ట్వీట్ లో ఎండగట్టారు.

ఇలా పోలవరం, అన్న క్యాంటీన్లలో టీడీపీ దోపిడీ కథను విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో బయటపెట్టారు. మరి దీనిపై టీడీపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో వేచి చూడాలి.

First Published:  2 Aug 2019 6:35 AM GMT
Next Story