Telugu Global
Cinema & Entertainment

'సరిలేరు' టీమ్.... ఇక ట్రైన్ జర్నీ....

‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ వంటి హిట్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం…. హ్యట్రిక్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. తాజాగా దర్శకుడు […]

సరిలేరు టీమ్.... ఇక ట్రైన్ జర్నీ....
X

‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ వంటి హిట్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం…. హ్యట్రిక్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాకి సంబంధించి సెకండ్ షెడ్యూల్ గురించి అనిల్ రావిపూడి ఓ ఆసక్తికరమైన వార్త బయటపెట్టారు.

ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ లో ట్రైన్ సీక్వెన్స్ షూటింగ్ జరగబోతోందని, సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తారని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఇంతకుముందు సినిమాలలో లాగానే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కూడా ఎంటర్ టైన్ మెంట్ దట్టంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ పాత్ర పోషించబోతున్నారు. అనిల్ సుంకర మరియు దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

First Published:  3 Aug 2019 4:37 AM GMT
Next Story