Telugu Global
Cinema & Entertainment

మానభంగం చేసింది "ఎవరు"?

అడవి శేష్ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఆఖరి నిమిషం వరకు సస్పెన్స్ రేపేలా స్క్రీన్ ప్లే రాసుకోవడం, అలాంటి కథలు ఎంచుకోవడం ఈ హీరోకు వెన్నతో పెట్టిన విద్య. క్షణం, గూఢచారి సినిమాలు చూసిన వాళ్లకు ఎవరికైనా ఈ విషయం ఈజీగా అర్థమౌతుంది. అలాంటి హీరో ఇప్పుడు ఎవరు అనే మరో థ్రిల్లర్ రెడీ చేశాడు. ఈరోజు ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ అయింది. ట్రయిలర్ చూస్తే మతిపోవడం ఖాయం. హాలీవుడ్ సినిమాకు […]

మానభంగం చేసింది ఎవరు?
X

అడవి శేష్ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఆఖరి నిమిషం వరకు సస్పెన్స్ రేపేలా స్క్రీన్ ప్లే రాసుకోవడం, అలాంటి కథలు ఎంచుకోవడం ఈ హీరోకు వెన్నతో పెట్టిన విద్య. క్షణం, గూఢచారి సినిమాలు చూసిన వాళ్లకు ఎవరికైనా ఈ విషయం ఈజీగా అర్థమౌతుంది. అలాంటి హీరో ఇప్పుడు ఎవరు అనే మరో థ్రిల్లర్ రెడీ చేశాడు. ఈరోజు ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ అయింది. ట్రయిలర్ చూస్తే మతిపోవడం ఖాయం.

హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది ఎవడు ట్రయిలర్. మరీ ముఖ్యంగా ఓ రేప్, ఓ మర్డర్ మిస్టరీల్ని ఈ ట్రయిలర్ లో హైలెట్ చేసి చూపించారు. మానభంగం చేయబోతే ఆత్మరక్షణ కోసం చంపేశాననేది హీరోయిన్ రెజీనా వాదన. కేవలం చంపడం కోసమే మానభంగం డ్రామా ఆడుతున్నారనేది విక్రమ్ వాసుదేవ్ (శేష్) వాదన. ఈ రెండు వాదనల్లో ఏది నిజమో తేలాలంటే ఎవరు సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే.

'ఎవ‌రు'. 'బ‌లుపు', 'ఊపిరి', 'క్ష‌ణం' వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా బ్యాన‌ర్‌పై ఈ చిత్రం నిర్మిత‌మ‌వుతోంది. వెంక‌ట్ రామ్‌జీ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాత‌లు. ఈ చిత్రంలో రెజీనా హీరోయిన్‌గా న‌టిస్తుంది. న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేస్తున్నారు.

First Published:  5 Aug 2019 5:19 AM GMT
Next Story