3వ తరగతి ఆదిత్యను హత్య చేసింది తోటి విద్యార్థే
కృష్టా జిల్లా చల్లపల్లి బీసీ బాలుర హాస్టల్లో ఘోరం జరిగింది. మూడో తరగతి చదువుతున్న ఆదిత్య అనే బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. హాస్టల్ బాత్రూంలో ఆదిత్య విగత జీవిగా పడి ఉండడం అందరినీ కలచివేసింది. ఇదే హాస్టల్లో తన అన్నతో పాటు ఉంటూ ఆదిత్య చదువుకుంటున్నాడు. రోజూ అన్నతో పాటే గదిలో పడుకునే వాడు. సోమవారం రాత్రి గదికి రాకపోవడంతో వేరే గదిలో ఏమైనా నిద్రపోయాడేమోనని అతడి అన్న భావించాడు. కానీ ఉదయం ఆదిత్య బాత్రూంలో […]
కృష్టా జిల్లా చల్లపల్లి బీసీ బాలుర హాస్టల్లో ఘోరం జరిగింది. మూడో తరగతి చదువుతున్న ఆదిత్య అనే బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. హాస్టల్ బాత్రూంలో ఆదిత్య విగత జీవిగా పడి ఉండడం అందరినీ కలచివేసింది. ఇదే హాస్టల్లో తన అన్నతో పాటు ఉంటూ ఆదిత్య చదువుకుంటున్నాడు. రోజూ అన్నతో పాటే గదిలో పడుకునే వాడు. సోమవారం రాత్రి గదికి రాకపోవడంతో వేరే గదిలో ఏమైనా నిద్రపోయాడేమోనని అతడి అన్న భావించాడు. కానీ ఉదయం ఆదిత్య బాత్రూంలో నెత్తుటి మడుగులో పడి ఉన్నాడు.
గొంతు కోసి హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ హత్య ఎవరు చేసి ఉంటారన్న దానిపై పోలీసులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హాస్టల్లో ఉంటున్న పదో తరగతి విద్యార్థే ఆదిత్యను చంపినట్టు తేలింది. తొలుత ఆదిత్యకు, పదో తరగతి విద్యార్థికి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో తనను ఆదిత్య తిట్టాడని పదో తరగతి విద్యార్థి పోలీసులకు వివరించాడు. రాత్రి 9గంటల సమయంలోనూ మరోసారి తిట్టాడని వెల్లడించాడు. అందుకే ఆదిత్యను చంపేసినట్టు అంగీకరించాడు.
పెన్సిల్ చెక్కే చాకుతో ఆదిత్య మెడను కోసినట్టు వివరించాడు. చాకును హత్య చేసిన బాలుడి సూట్ కేస్ నుంచి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హత్య చేసిన సమయంలో రక్తం తన బట్టలపై పడడంతో వాటిని కూడా సూట్కేసులో పెట్టి వేరే బట్టలు వేసుకుని ఏమీ తెలియనట్టు నిద్రపోయాడు పదో తరగతి పిల్లాడు. వీరిద్దరూ తిట్టుకున్న సమయంలో వాచ్మెన్ ఇద్దరినీ మందలించి పంపించాడు. హాస్టల్లో ఆదిత్య హత్య నేపథ్యంలో వాచ్మెన్తో పాటు, హాస్టల్ వార్డెన్ను కలెక్టర్ సస్పెండ్ చేశారు.