Telugu Global
Cinema & Entertainment

థాయ్‌లాండ్‌లో.... బాలయ్య

మొత్తానికి బాలయ్య సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఎన్నికల తర్వాత వెంటనే పట్టాలపైకి వస్తుందనుకున్న సినిమా ఇన్నాళ్లకు ప్రారంభమైంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న తన 105వ చిత్రం థాయ్ లాండ్ లో మొదలైంది. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భూమిక చావ్లా, ప్రకాశ్ రాజ్, జయసుధ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. థాయ్‌లాండ్‌లో జరుగుతున్న ఈ భారీ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను […]

థాయ్‌లాండ్‌లో.... బాలయ్య
X

మొత్తానికి బాలయ్య సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఎన్నికల తర్వాత వెంటనే పట్టాలపైకి వస్తుందనుకున్న సినిమా ఇన్నాళ్లకు ప్రారంభమైంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న తన 105వ చిత్రం థాయ్ లాండ్ లో మొదలైంది. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భూమిక చావ్లా, ప్రకాశ్ రాజ్, జయసుధ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

థాయ్‌లాండ్‌లో జరుగుతున్న ఈ భారీ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సినిమాలోని నటీనటులందరూ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. 'జైసింహా' వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత బాలక‌ృష్ణ, సి.కల్యాణ్ కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంతన్ భట్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. పరుచూరి మురళి కథను అందిస్తున్నారు.

నిజానికి దాదాపు నెల రోజుల కిందటే ఈ సినిమా సెట్స్ పైకి రావాల్సింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో జగన్ నేతృత్వంలో వైసీపీ సర్కార్ కొలువుదీరింది. ఈ రెండు అంశాలకు ఓ లింక్ ఉంది. పరుచూరి మురళి రాసిన కథలో జగన్ కు వ్యతిరేకంగా కొన్ని సన్నివేశాలున్నాయి. టీడీపీ శ్రేణులు ఊహించని విధంగా వైసీపీ అధికారంలోకి రావడంతో.. పరుచూరి కథకు భారీ మార్పులు చేయాల్సి వచ్చింది. అందుకే సినిమా సెట్స్ పైకి రావడానికి ఆలస్యమైంది.

First Published:  11 Aug 2019 3:00 AM GMT
Next Story