Telugu Global
National

వెంకయ్య పొరపాటున రాజకీయ నాయకుడయ్యాడు...

అది చెన్నైలోని ఉప రాష్ట్రపతి వెంకయ్యపై రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం…. పుస్తకం పేరు ‘లిజనింగ్, లెర్నింగ్ అండ్ లీడింగ్’. ఈ పుస్తకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే మాట్లాడిన రజనీకాంత్ చాలా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇవి కలకలం రేపాయి.. రజినీకాంత్ మాట్లాడుతూ.. ‘వెంకయ్యనాయుడు ఓ గొప్ప ఆధ్యాత్మిక వేత్త.. ఆయన పొరపాటున రాజకీయ నాయకుడయ్యారు.. రాజకీయాల్లోకి రాకుండా ఆధాత్మిక […]

వెంకయ్య పొరపాటున రాజకీయ నాయకుడయ్యాడు...
X

అది చెన్నైలోని ఉప రాష్ట్రపతి వెంకయ్యపై రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం…. పుస్తకం పేరు ‘లిజనింగ్, లెర్నింగ్ అండ్ లీడింగ్’. ఈ పుస్తకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే మాట్లాడిన రజనీకాంత్ చాలా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇవి కలకలం రేపాయి..

రజినీకాంత్ మాట్లాడుతూ.. ‘వెంకయ్యనాయుడు ఓ గొప్ప ఆధ్యాత్మిక వేత్త.. ఆయన పొరపాటున రాజకీయ నాయకుడయ్యారు.. రాజకీయాల్లోకి రాకుండా ఆధాత్మిక రంగం వైపు వెళ్లి ఉంటే గొప్ప మార్గదర్శకుడు అయ్యి ఉండేవారు’ అంటూ ప్రశంసించారు. అలాంటి ఆధ్యాత్మికవేత్తను తాము పోగొట్టుకున్నామని రజినీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా రజినీకాంత్ మాటలకు వేదికపై ఉన్న అమిత్ షా , వెంకయ్య షాక్ అయ్యారు. ఆ తర్వాత సరదాగా నవ్వుకున్నారు.

కేంద్రంలో మోడీషాల ద్వయం వచ్చాక సీనియర్లను పార్టీ నుంచి సాగనంపింది. అద్వానీ, మురళీ మనోహర్ జోషి సహా చాలా మందిని రాజకీయాలకు దూరం చేసింది.

ఇక రాజకీయంగా యాక్టివ్ గా ఉండే వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతిని చేసి అడ్డు తొలగించుకున్నారన్న విమర్శలు వచ్చాయి. ఎంతో యాక్టివ్ గా ఉండే వెంకయ్యను ఉపరాష్ట్రపతిని చేసి ఉత్సవ విగ్రహంలా మార్చిన మోడీషాల తీరును ఎండగట్టేందుకే ఇలా రజనీకాంత్ మాట్లాడి ఉండవచ్చన్న చర్చ సాగుతోంది. ఏదిఏమైనా అమిత్ షా వేదికపై ఉండగానే ఈ వ్యాఖ్యలు చేసి రజినీకాంత్ అందరికీ షాక్ ఇచ్చారు.

First Published:  11 Aug 2019 6:52 AM GMT
Next Story