Telugu Global
NEWS

ప్రత్యేక కుర్చీని తిరస్కరించిన జగన్‌

జగన్‌ పాదయాత్రపై మరో పుస్తకం ఆవిష్కృతమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్‌లో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. జయహో పేరుతో జగన్‌ పాదయాత్రపై ఈ పుస్తకాన్ని రూపొందించారు. పాదయాత్రలోని కీలక ఘట్టాలకు సంబంధించిన ఫోటోలతో ఈ పుస్తకాన్ని తెచ్చారు. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై సీఎంకు ప్రత్యేకంగా చైర్‌ను ఏర్పాటు చేశారు. మిగిలిన వారికి సాధారణ కుర్చీలను సిద్ధం చేశారు. అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుర్చీనీ సీఎం సున్నితంగా […]

ప్రత్యేక కుర్చీని తిరస్కరించిన జగన్‌
X

జగన్‌ పాదయాత్రపై మరో పుస్తకం ఆవిష్కృతమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్‌లో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. జయహో పేరుతో జగన్‌ పాదయాత్రపై ఈ పుస్తకాన్ని రూపొందించారు.

పాదయాత్రలోని కీలక ఘట్టాలకు సంబంధించిన ఫోటోలతో ఈ పుస్తకాన్ని తెచ్చారు. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై సీఎంకు ప్రత్యేకంగా చైర్‌ను ఏర్పాటు చేశారు. మిగిలిన వారికి సాధారణ కుర్చీలను సిద్ధం చేశారు. అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుర్చీనీ సీఎం సున్నితంగా తిరస్కరించారు.

దాన్ని పక్కన పెట్టించి అందరికీ ఏర్పాటు చేసినట్టుగానే సాధారణ కుర్చీని తెప్పించుకున్నారు జగన్‌. జగన్‌ సీఎం అయిన తర్వాత ఆయనపై పుస్తకావిష్కరణలు ఇటీవల పెరిగాయి. పుస్తకాలతో జగన్‌ మనసు గెలించేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు.

First Published:  12 Aug 2019 2:55 AM GMT
Next Story