Telugu Global
National

తెలంగాణకు మహర్దశ.... కొత్తగా 6 ఎయిర్ పోర్టులు

తెలంగాణకు హైదరాబాద్ తప్పితే మరో అంతర్జాతీయ నగరం లేదు. మరో విమానాశ్రయం లేదు. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో పెద్ద నగరం వరంగల్. ఇక నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మంలు కూడా కార్పొరేషన్లే. కానీ ఎక్కడా విమానాశ్రయాలు లేవు. అదే ఏపీలో అయితే విజయవాడతోపాటు విశాఖ, తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయాలున్నాయి. తెలంగాణలో కేవలం హైదరాబాద్ కే అభివృద్ధి అంతా కేంద్రీకృతమైంది. శంషాబాద్, బేగంపేట విమానాశ్రయాలే తెలంగాణకు ఉన్నాయి. జిల్లాల పర్యటనకు వెళ్లాలంటే హెలీక్యాప్టర్, రోడ్డు మార్గాలే దిక్కు. రాష్ట్రపతి, ప్రధాని వంటి […]

తెలంగాణకు మహర్దశ.... కొత్తగా 6 ఎయిర్ పోర్టులు
X

తెలంగాణకు హైదరాబాద్ తప్పితే మరో అంతర్జాతీయ నగరం లేదు. మరో విమానాశ్రయం లేదు. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో పెద్ద నగరం వరంగల్. ఇక నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మంలు కూడా కార్పొరేషన్లే. కానీ ఎక్కడా విమానాశ్రయాలు లేవు.

అదే ఏపీలో అయితే విజయవాడతోపాటు విశాఖ, తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయాలున్నాయి. తెలంగాణలో కేవలం హైదరాబాద్ కే అభివృద్ధి అంతా కేంద్రీకృతమైంది. శంషాబాద్, బేగంపేట విమానాశ్రయాలే తెలంగాణకు ఉన్నాయి.

జిల్లాల పర్యటనకు వెళ్లాలంటే హెలీక్యాప్టర్, రోడ్డు మార్గాలే దిక్కు. రాష్ట్రపతి, ప్రధాని వంటి ప్రముఖులు తెలంగాణ జిల్లాల పర్యటనకు వచ్చినా కూడా వారు నేరుగా రావడానికి విమాన సౌకర్యం లేదు. దీంతో హెలీకాప్టర్ లోనే వస్తున్నారు. సాయంత్రం 6 గంటలు దాటితే హెలీకాప్టర్ పనిచేయక రాత్రివేళ రోడ్డు మార్గాన వెళ్లాల్సిన పరిస్థితులు. ఏపీలో లాగానే తెలంగాణలోనూ వివిధ ప్రాంతాల్లో ఎయిర్ పోర్టులు నిర్మించాలని తాజాగా తెలంగాణ సర్కారు యోచిస్తోంది.

ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్ మినహా ఎక్కడా విమాన సేవలు లేవు. ఇప్పుడు ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో విమానంలో ఒక్కరోజులోనే సుదూర ప్రాంతాలకు వెళ్లి పనులు పూర్తి చేసుకుంటున్న కాలం. మున్ముందు విమానయాన రంగానికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప భవిష్యత్ ఉంది. అందుకే తెలంగాణ సర్కారు రాష్ట్రంలో మరిన్ని విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

ఏపీ, తమిళనాడు, కర్ణాటక సహా పక్క రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ఎయిర్ పోర్టులు చాలా తక్కువ. అందుకే తాజాగా పెరుగుతున్న అవసరాల దృష్ట్యా తెలంగాణలో కొత్తగా ఆరు విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారు యోచిస్తోంది.

తెలంగాణలో కొత్తగా ఆదిలాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెం, మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్ లలో కొత్త విమానాశ్రయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కేంద్ర ప్రభుత్వ ఉడాన్ పథకం కింద వీటిని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఈ మేరకు అధ్యయనం చేయాలని ఎయిర్ పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)ని కన్సల్టెన్సీగా నియమించారు. సెప్టెంబర్ కల్లా నివేదిక వచ్చాక తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్టులపై పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోనున్నారు.

First Published:  14 Aug 2019 8:34 AM GMT
Next Story