Telugu Global
Cinema & Entertainment

'అల... వైకుంఠపురములో.... స్టైలిష్ స్టార్

ఈ మధ్యనే ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తో డిజాస్టర్ అందుకున్న టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల తర్వాత బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడో సినిమా ఇది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో టబు, నివేద పేతురాజ్, సునీల్, సుశాంత్ తదితరులు ముఖ్య పాత్రలు […]

అల... వైకుంఠపురములో.... స్టైలిష్ స్టార్
X

ఈ మధ్యనే ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తో డిజాస్టర్ అందుకున్న టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల తర్వాత బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడో సినిమా ఇది.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో టబు, నివేద పేతురాజ్, సునీల్, సుశాంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు దర్శకనిర్మాతలు.

ఈ సినిమాకు ‘అలా వైకుంఠపురంలో’ అనే ఒక ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేసారు. టైటిల్ తో అలా చిన్న టీజర్ ని కూడా విడుదల చేసారు. ‘ఏంట్రా గ్యాప్ వచ్చింది’ అని మురళి శర్మ అడగగా ‘ఇవ్వలేదు.. వచ్చింది’ అంటూ బన్నీ సమాధానమిస్తాడు.

బన్నీ-త్రివిక్రమ్ కాంబో లో ఇంతకుముందు విడుదలైన సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా ఎంటర్ టైన్ మెంగ్ కు పెద్ద పీట ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా కథ గురించి కూడా బోలెడు పుకార్లు బయటకు వస్తున్నాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

గీతా ఆర్ట్స్ , హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.

First Published:  15 Aug 2019 5:10 AM GMT
Next Story