Telugu Global
Cinema & Entertainment

రష్మిక టైం అడిగింది.... కియారా ఓకే చేసింది

ఒకవైపు సమంతా, నయనతార, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లు సంవత్సరానికి ఒకటి అరా సినిమాలు చేస్తుంటే… ఈ మధ్యనే ఇండస్ట్రీలోకి వచ్చిన రష్మిక మందన, పూజా హెగ్డే, కీయార అద్వానీ వంటి హీరోయిన్లు వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నారు. ముఖ్యంగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో అనుకున్నంత హిట్ అందుకోనప్పటికీ ఈమెకు ఉన్న డిమాండ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో హీరోయిన్ గా […]

రష్మిక టైం అడిగింది.... కియారా ఓకే చేసింది
X

ఒకవైపు సమంతా, నయనతార, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లు సంవత్సరానికి ఒకటి అరా సినిమాలు చేస్తుంటే… ఈ మధ్యనే ఇండస్ట్రీలోకి వచ్చిన రష్మిక మందన, పూజా హెగ్డే, కీయార అద్వానీ వంటి హీరోయిన్లు వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నారు.

ముఖ్యంగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో అనుకున్నంత హిట్ అందుకోనప్పటికీ ఈమెకు ఉన్న డిమాండ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.

తాజాగా దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది. ఈ సినిమాతో తమిళంలో కూడా అడుగుపెట్టనుందని అంతా అనుకున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ అవకాశం కియారా అద్వాని కి దక్కినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఓకే చేయడానికి రష్మిక టైం అడగడంతో…. దర్శక నిర్మాతలు కియారా అద్వానీ వైపు మొగ్గు చూపారట. ఆమె వెంటనే సినిమాకి ఓకే చెప్పేయడంతో ఆమె ని ఫైనలైజ్ చేశారని తెలుస్తోంది.

కేవలం ఒక భాష కి మాత్రమే పరిమితం అవ్వకుండా కియారా అద్వానీ అన్ని భాషల్లోనూ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. కొత్త హీరోయిన్ల మధ్య పోటీ రోజు రోజుకు పెరుగుతుండటంతో రష్మిక మందన్న కూడా త్వరగా నిర్ణయాలు తీసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు.

First Published:  16 Aug 2019 2:06 AM GMT
Next Story