Telugu Global
NEWS

ప్రపంచ బ్యాడ్మింటన్లో కిడాంబీ శ్రీకాంత్ తొలిగెలుపు

రెండోరౌండ్లో ప్రణవ్, సాయి ప్రణీత్ ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ తొలిరౌండ్ పోటీలలో ముగ్గురు భారత క్రీడాకారులు విజయాలతో శుభారంభం చేశారు. కిడాంబీ శ్రీకాంత్, సాయి ప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్ రెండోరౌండ్ కు అర్హత సంపాదించారు. స్విట్జర్లాండ్ లోని బాసెల్ వేదికగా జరుగుతున్న ఈ టో్ర్నీ తొలిరౌండ్లో శ్రీకాంత్ గట్టి పోటీ ఎదుర్కొని మూడుగేమ్ ల పోరులో ఐర్లాండ్ ఆటగాడు నహట్ న్యుగ్యున్ ను అధిగమించాడు. గంటా 6 నిముషాలపాటు సాగిన సమరంలో తొలిగేమ్ ను 17-21తో కోల్పోయిన శ్రీకాంత్…ఆ […]

ప్రపంచ బ్యాడ్మింటన్లో కిడాంబీ శ్రీకాంత్ తొలిగెలుపు
X
  • రెండోరౌండ్లో ప్రణవ్, సాయి ప్రణీత్

ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ తొలిరౌండ్ పోటీలలో ముగ్గురు భారత క్రీడాకారులు విజయాలతో శుభారంభం చేశారు. కిడాంబీ శ్రీకాంత్, సాయి ప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్ రెండోరౌండ్ కు అర్హత సంపాదించారు.

స్విట్జర్లాండ్ లోని బాసెల్ వేదికగా జరుగుతున్న ఈ టో్ర్నీ తొలిరౌండ్లో శ్రీకాంత్ గట్టి పోటీ ఎదుర్కొని మూడుగేమ్ ల పోరులో ఐర్లాండ్ ఆటగాడు నహట్ న్యుగ్యున్ ను అధిగమించాడు.

గంటా 6 నిముషాలపాటు సాగిన సమరంలో తొలిగేమ్ ను 17-21తో కోల్పోయిన శ్రీకాంత్…ఆ తర్వాతి రెండుగేమ్ లను 21-16, 21-6తో నెగ్గి రెండోరౌండ్ బెర్త్ ఖాయం చేసుకొన్నాడు.

మరో తొలిరౌండ్ పోటీలో ప్రపంచ 19వ ర్యాంక్ ఆటగాడు సాయి ప్రణీత్ 21-17, 21-16తో కెనడా ఆటగాడు ఆంథోనీ హో ను చిత్తు చేసి రెండోరౌండ్లో అడుగుపెట్టాడు.

ప్రపంచ 30వ ర్యాంక్ ప్లేయర్ ప్రణయ్ 17-21, 21-10, 21-11తో ఫిన్లాండ్ ఆటగాడు ఎటో హీనో పై విజేతగా నిలిచాడు.

బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలిరౌండ్ పోటీలలో పీవీ సింధు, సైనా నెహ్వాల్ సునాయాసంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.

First Published:  20 Aug 2019 1:27 AM GMT
Next Story