Telugu Global
Cinema & Entertainment

సోషల్ మీడియాలో... 'సాహో' కథ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సాహో’ సినిమా మరికొన్ని రోజులలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్ వంటి స్టార్ నటీనటులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా కథ ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయింది. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూస్తే సినిమా అంతా రెండు […]

సోషల్ మీడియాలో... సాహో కథ
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సాహో’ సినిమా మరికొన్ని రోజులలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్ వంటి స్టార్ నటీనటులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

ఈ సినిమా కథ ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయింది. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూస్తే సినిమా అంతా రెండు వేల కోట్ల రాబరీ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ కథ ప్రకారం ‘సాహో’ సినిమాలో ఆ రెండు వేల కోట్లు దొంగిలించింది ప్రభాసేనట.

ఆసక్తికరమైన ట్విస్ట్ ఏమిటంటే ఇప్పుడు అదే రాబరీ కేస్ కి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కూడా ప్రభాసే అవుతాడు. అసలు ప్రభాస్ ఆ రాబరీ ఎందుకు చేశాడు? అని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో తెలుస్తుందట.

ఈ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు కూడా మనసుకి హత్తుకునే విధంగా ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. కథలో మేజర్ ట్విస్ట్ రివీల్ అయిపోయినట్టే. మరి సినిమా ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తుందో వేచి చూడాల్సి ఉంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కానుంది.

First Published:  27 Aug 2019 1:00 AM GMT
Next Story