Telugu Global
Cinema & Entertainment

పదహారేళ్ల తర్వాత.... మళ్ళీ అక్కడ మహేష్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో మొదటి బ్లాక్ బస్టర్ సినిమా ‘ఒక్కడు’. ఆ సినిమా షూటింగ్ చాలా వరకు కర్నూల్ లోనే జరిగింది. మహేష్ బాబు భూమిక ని మొదటిసారి కర్నూల్ లోనే కలుస్తాడు. అదే సినిమాలో కొండారెడ్డి బురుజు వద్ద ప్రకాష్ రాజ్ మరియు మహేష్ బాబుల మధ్య ఫైటింగ్ సీన్ సినిమాకి హైలైట్. ఇప్పుడు దాదాపు 16 ఏళ్ల తర్వాత మహేష్ బాబు మళ్ళీ కర్నూల్ తో మరో సినిమా చేయబోతున్నాడు. […]

పదహారేళ్ల తర్వాత.... మళ్ళీ అక్కడ మహేష్
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో మొదటి బ్లాక్ బస్టర్ సినిమా ‘ఒక్కడు’. ఆ సినిమా షూటింగ్ చాలా వరకు కర్నూల్ లోనే జరిగింది.

మహేష్ బాబు భూమిక ని మొదటిసారి కర్నూల్ లోనే కలుస్తాడు. అదే సినిమాలో కొండారెడ్డి బురుజు వద్ద ప్రకాష్ రాజ్ మరియు మహేష్ బాబుల మధ్య ఫైటింగ్ సీన్ సినిమాకి హైలైట్.

ఇప్పుడు దాదాపు 16 ఏళ్ల తర్వాత మహేష్ బాబు మళ్ళీ కర్నూల్ తో మరో సినిమా చేయబోతున్నాడు. మహేష్ ప్రస్తుతం నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ కూడా కర్నూల్ లో జరగనుందట.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో ఒక సన్నివేశం కొండారెడ్డి బురుజు వద్ద తీయాల్సిందట. కానీ ఇప్పుడు మహేష్ బాబు అక్కడికి వెళితే…. అభిమానులను కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. అందుకే ఈ సినిమా కోసం కొండా రెడ్డి బురుజు స్పెషల్ సెట్ ని రామోజీ ఫిలిం సిటీలో డిజైన్ చేశారు.

రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ‘ఒక్కడు’ మరియు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలకి మధ్య మరొక కామన్ పాయింట్ కూడా ఉంది. ఈ రెండు సినిమాల్లోనూ మహేష్ బాబు పాత్ర పేరు అజయ్.

First Published:  28 Aug 2019 5:27 AM GMT
Next Story