Telugu Global
NEWS

ప్రజలు మీ పై ఉమ్మిన సంగతి మరిచారా యనమల?

సీఎం వైఎస్‌ జగన్ పై‌, ఏపీ ఆర్థిక వ్యవస్థ పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు నిన్న చేసిన కామెంట్స్‌ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌ ద్వారా యనమలకు కౌంటర్‌ ఇచ్చారు. ఏపీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి.. హైదరాబాద్‌లో ఎకానమీని పెంచడమే లక్ష్యమంగా జగన్ పనిచేస్తున్నారని యనమల విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో… యనమల పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మీకు ఏమైంది యనమల గారు? అంటూ ప్రశ్నించారు. ఆర్థిక మంత్రిగా రాష్ట్రాన్ని 20 […]

ప్రజలు మీ పై ఉమ్మిన సంగతి మరిచారా యనమల?
X

సీఎం వైఎస్‌ జగన్ పై‌, ఏపీ ఆర్థిక వ్యవస్థ పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు నిన్న చేసిన కామెంట్స్‌ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌ ద్వారా యనమలకు కౌంటర్‌ ఇచ్చారు.

ఏపీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి.. హైదరాబాద్‌లో ఎకానమీని పెంచడమే లక్ష్యమంగా జగన్ పనిచేస్తున్నారని యనమల విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో… యనమల పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మీకు ఏమైంది యనమల గారు? అంటూ ప్రశ్నించారు.

ఆర్థిక మంత్రిగా రాష్ట్రాన్ని 20 ఏళ్ళు వెనక్కి నెట్టిన ఘనులు మీరని… అలాంటిది తెలంగాణ లబ్ది కోసం జగన్ రాష్ట్రాభివృద్ధికి గండి కొడుతున్నారని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఎన్నికల ముందు కూడా కేసీఆర్, మోదీతో… జగన్‌ చేతులు కలిపారని ప్రచారం చేసినా…. ప్రజలు మీ పై తుపుక్కున ఉమ్మిన సంగతి మరిచారా? అని యనమలను నిలదీశారు విజయసాయిరెడ్డి.

First Published:  28 Aug 2019 6:03 AM GMT
Next Story