Telugu Global
Cinema & Entertainment

యంగ్  హీరో సినిమా ఆగిపోయింది?

రీసెంట్ గా యాక్సిడెంట్ తో వార్తల్లో నిలిచాడు హీరో రాజ్ తరుణ్. అప్పట్లో జరిగిన ఆ యాక్సిడెంట్ ఇప్పుడా హీరో కెరీర్ కు చుట్టుకుంది. కేవలం ఆ యాక్సిడెంట్ కారణంగానే రాజ్ తరుణ్ కొత్త సినిమా వాయిదా పడింది. ఆ సినిమా పేరు ‘ఇద్దరి లోకం ఒకటే’. ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం… రాజ్ తరుణ్ హీరోగా ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే సినిమా నిర్మించాడు దిల్ రాజు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇక రేపోమాపో ప్రచారం […]

యంగ్  హీరో సినిమా ఆగిపోయింది?
X

రీసెంట్ గా యాక్సిడెంట్ తో వార్తల్లో నిలిచాడు హీరో రాజ్ తరుణ్. అప్పట్లో జరిగిన ఆ యాక్సిడెంట్ ఇప్పుడా హీరో కెరీర్ కు చుట్టుకుంది. కేవలం ఆ యాక్సిడెంట్ కారణంగానే రాజ్ తరుణ్ కొత్త సినిమా వాయిదా పడింది. ఆ సినిమా పేరు ‘ఇద్దరి లోకం ఒకటే’. ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం…

రాజ్ తరుణ్ హీరోగా ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే సినిమా నిర్మించాడు దిల్ రాజు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇక రేపోమాపో ప్రచారం స్టార్ట్ చేసి, సాహో మేనియా ముగిసిన వెంటనే థియేటర్లలోకి రావాలనేది దిల్ రాజు ప్లాన్. కానీ అంతలోనే రాజ్ తరుణ్ యాక్సిడెంట్ చేశాడు. రింగ్ రోడ్డులో ఓ గోడకు ఢీకొట్టాడు. ఆ తర్వాత వరుస పెట్టి ఏదేదో స్టేట్ మెంట్స్ ఇచ్చాడు. ఇవన్నీ కలిసి అతడి ఇమేజ్ ను దెబ్బతీశాయి.

ఇలాంటి టైమ్ లో ప్రచారం పేరిట రాజ్ తరుణ్ మీడియా ముందుకొస్తే, మరోసారి యాక్సిడెంట్ అంశం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. అప్పట్లో యాక్సిడెంట్ స్పాట్ నుంచి రాజ్ తరుణ్ పారిపోయిన విషయాన్ని మీడియా మరోసారి గుచ్చిగుచ్చి అడిగే అవకాశం ఉంది. అందుకే దిల్ రాజు ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేశాడు. యాక్సిడెంట్ విషయాన్ని అంతా మరిచిపోయారని నిర్థారించుకున్న తర్వాతే మూవీని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. పాపం రాజ్ తరుణ్.. ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

First Published:  31 Aug 2019 7:02 PM GMT
Next Story