Telugu Global
Cinema & Entertainment

శాలిని పాండేకి.... బాలీవుడ్ ఆఫర్

‘అర్జున్ రెడ్డి’ సినిమా తో హీరోయిన్ గా షాలిని పాండే మంచి పేరు తెచ్చుకుంది. అయితే మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నప్పటికీ ఆ తరువాత పెద్దగా ఆఫర్లు రాలేదు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘118’ సినిమాలో హీరోయిన్ గా నటించింది… కానీ ఆ సినిమాతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అయితే టాలీవుడ్ లో మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న శాలిని పాండే కి… అటు బాలీవుడ్ లో మాత్రం అదృష్టం […]

శాలిని పాండేకి.... బాలీవుడ్ ఆఫర్
X

‘అర్జున్ రెడ్డి’ సినిమా తో హీరోయిన్ గా షాలిని పాండే మంచి పేరు తెచ్చుకుంది. అయితే మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నప్పటికీ ఆ తరువాత పెద్దగా ఆఫర్లు రాలేదు.

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘118’ సినిమాలో హీరోయిన్ గా నటించింది… కానీ ఆ సినిమాతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అయితే టాలీవుడ్ లో మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న శాలిని పాండే కి… అటు బాలీవుడ్ లో మాత్రం అదృష్టం వరించిందంటున్నారు.

తాజాగా షాలిని పాండే బాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిలిమ్స్ పతాకం తో మూడు సినిమాలు డీల్ ని కుదుర్చుకుంది. అందులో మొదటి సినిమా ‘జయేష్ భాయ్ జోర్దార్’. ఇందులో రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు దివ్యంగ్ తక్కర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి మొదలు కాబోతోంది. మరి మిగతా రెండు సినిమాల గురించిన వివరాలు త్వరలో తెలియనున్నాయి.

షాలిని పాండే నటన చూసి ఇంప్రెస్ అయిన నిర్మాతలు ఈ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.

మరో వైపు టాలీవుడ్ లో అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ‘సైలెన్స్’ లో ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది షాలిని పాండే.

First Published:  3 Sep 2019 3:40 AM GMT
Next Story