Telugu Global
NEWS

సౌతాఫ్రికా సిరీస్ లో టెస్ట్ ఓపెనర్ గా రోహిత్ శర్మ

రాహుల్ వైఫల్యాలతో విసిగిపోయిన సెలెక్టర్లు గత రెండేళ్లలో ఆరుగురు ఓపెనర్లతో ప్రయోగం వన్డే, టీ-20 ఫార్మాట్లలో భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ…టెస్ట్ క్రికెట్లోనూ ఇక ఓపెనర్ అవతారం ఎత్తనున్నాడు. పదేపదే అవకాశాలు ఇస్తున్నా.. వరుసవైఫల్యాలతో సెలెక్టర్ల సహనానికి పరీక్ష పెట్టిన యువఓపెనర్ కెఎల్ రాహుల్ ను పక్కనపెట్టాలని భావిస్తున్నట్లు చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తమ మనసులో మాట బయట పెట్టారు. సౌతాఫ్రికాతో జరిగే తీన్మార్ టెస్ట్ సిరీస్ లో రోహిత్ శర్మను ఓపెనర్ గా దించే ఆలోచన […]

సౌతాఫ్రికా సిరీస్ లో టెస్ట్ ఓపెనర్ గా రోహిత్ శర్మ
X
  • రాహుల్ వైఫల్యాలతో విసిగిపోయిన సెలెక్టర్లు
  • గత రెండేళ్లలో ఆరుగురు ఓపెనర్లతో ప్రయోగం

వన్డే, టీ-20 ఫార్మాట్లలో భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ…టెస్ట్ క్రికెట్లోనూ ఇక ఓపెనర్ అవతారం ఎత్తనున్నాడు.

పదేపదే అవకాశాలు ఇస్తున్నా.. వరుసవైఫల్యాలతో సెలెక్టర్ల సహనానికి పరీక్ష పెట్టిన యువఓపెనర్ కెఎల్ రాహుల్ ను పక్కనపెట్టాలని భావిస్తున్నట్లు చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తమ మనసులో మాట బయట పెట్టారు.

సౌతాఫ్రికాతో జరిగే తీన్మార్ టెస్ట్ సిరీస్ లో రోహిత్ శర్మను ఓపెనర్ గా దించే ఆలోచన ఉందని ప్రకటించారు. రాహుల్ లో అసాధారణ నైపుణ్యం ఉందనే పదే పదే అవకాశాలు ఇస్తూ వచ్చామని చీఫ్ సెలెక్టర్ గుర్తు చేశారు.

2018 సీజన్ నుంచి ఆడిన మొత్తం 36 టెస్టు మ్యాచ్ ల్లో…రాహుల్ గత ఏడు టెస్టుల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ సాధించలేక జట్టుకే భారంగా మారాడు.

అంతేకాదు..గత రెండేళ్లలో శిఖర్ ధావన్, మురళీ విజయ్, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, హనుమ విహారీ, పార్థివ్ పటేల్, రాహుల్ లను ఓపెనర్లుగా ఆడించినా నిలదొక్కుకోలేకపోడం భారతజట్టు టీమ్ మేనేజ్ మెంట్ కు తలనొప్పిగా మారింది.

టెస్ట్ క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టుకు కుదురైన, నమ్మదగిన ఓపెనింగ్ జోడీ లేకపోడం ఆందోళనకు గురిచేసింది.

దీంతో సౌతాఫ్రికాతో వచ్చేనెలలో జరిగే టెస్టు సిరీస్ లో రోహిత్ శర్మను ఓపెనర్ గా బరిలోకి దించాలని టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది.

వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు, వన్డే ప్రపంచకప్ లో ఐదు శతకాలు బాదిన అరుదైన ఘనత రోహిత్ కు ఉంది.

అంతేకాదు..క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ శతకాలు బాదిన అతికొద్దిమంది ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడు.

తన కెరియర్ లో రోహిత్ గత ఆరేళ్ల కాలంలో.. ఇప్పటి వరకూ ఆడిన 27 టెస్టుల్లో 3 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు సాధించాడు. మిడిలార్డర్ లోనే రోహిత్ 1585 పరుగులు సాధించాడు.

ప్రస్తుతం మిడిలార్డర్లో అజింక్యా రహానే, హనుమ విహారీ నిలదొక్కుకోడంతో…రోహిత్ ను ఓపెనర్ గా దించాలని టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయించింది.

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ విశాఖ వేదికగా అక్టోబర్ 4న ప్రారంభంకానుంది.

First Published:  11 Sep 2019 9:00 PM GMT
Next Story