Telugu Global
NEWS

కుమారుడే కోడెలను హత్య చేశాడు " మేనల్లుడు సంచలన వ్యాఖ్యలు

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అనుమానాస్పద మృతి వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా కోడెల మేనల్లుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమారుడు కోడెల శివరాం వల్లనే శివప్రసాద్ చనిపోయాడని సత్తెనపల్లి డీ ఎస్పీ కి పిర్యాదు చేశారు మేనల్లుడు కంచేటి సాయి. శివరాం మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడు అని కోడెల తనకు ఫోన్ చేసి చెప్పారని వివరించారు. కోడెల ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కోడెలను లేదన్నారు. ఆస్తి […]

కుమారుడే కోడెలను హత్య చేశాడు  మేనల్లుడు సంచలన వ్యాఖ్యలు
X

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అనుమానాస్పద మృతి వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా కోడెల మేనల్లుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుమారుడు కోడెల శివరాం వల్లనే శివప్రసాద్ చనిపోయాడని సత్తెనపల్లి డీ ఎస్పీ కి పిర్యాదు చేశారు మేనల్లుడు కంచేటి సాయి.

శివరాం మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడు అని కోడెల తనకు ఫోన్ చేసి చెప్పారని వివరించారు. కోడెల ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కోడెలను లేదన్నారు.

ఆస్తి మొత్తం తన పేరున రాయాల్సిందిగా శివరాం ఒత్తిడి తెస్తున్నారని, తనను హత్య చేసేందుకు సిద్ధపడ్డవచ్చు అని కూడా ఫోన్ లో కోడెల ఆందోళన చెందారని సాయి వెల్లడించారు. ఆస్తి కోసమే శివరాం… కోడెలను హత్య చేశారని దీని పై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని సాయి కోరారు.

First Published:  16 Sep 2019 5:45 AM GMT
Next Story