Telugu Global
Cinema & Entertainment

మళ్లీ రిపీట్ అవనున్న 'నేనే రాజు నేనే మంత్రి' కాంబినేషన్

రానా దగ్గుబాటి ఆఖరిసారిగా హీరో గా కనిపించిన సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత రానా మళ్లీ వెండితెరపై హీరోగా కనిపించింది లేదు. రానా చేతిలో ఇప్పటికే బోలెడు పెద్ద సినిమాలు ఉన్నాయి… కానీ ఒక్కటి కూడా ఇంకా విడుదలకు సిద్ధంగా లేదు. మరోవైపు కాజల్ అగర్వాల్ ‘కవచం’, ‘సీత’, ‘రణరంగం’ వంటి సినిమాలలో నటించింది… కానీ అందులో […]

మళ్లీ రిపీట్ అవనున్న నేనే రాజు నేనే మంత్రి కాంబినేషన్
X

రానా దగ్గుబాటి ఆఖరిసారిగా హీరో గా కనిపించిన సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత రానా మళ్లీ వెండితెరపై హీరోగా కనిపించింది లేదు. రానా చేతిలో ఇప్పటికే బోలెడు పెద్ద సినిమాలు ఉన్నాయి… కానీ ఒక్కటి కూడా ఇంకా విడుదలకు సిద్ధంగా లేదు.

మరోవైపు కాజల్ అగర్వాల్ ‘కవచం’, ‘సీత’, ‘రణరంగం’ వంటి సినిమాలలో నటించింది… కానీ అందులో ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం రానా మరియు కాజల్ కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ మధ్యనే ‘ఓ బేబీ’ అనే సినిమాతో హిట్ అందుకున్న దర్శకురాలు నందినీరెడ్డి ఇప్పుడు మరొక సౌత్ కొరియన్ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సిద్ధం అవుతోందట. ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా రానా దగ్గుబాటి మరియు కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసినట్లు సమాచారం.

‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా లో రాధ, జోగేంద్ర పాత్రలలో కాజల్ మరియు రానాల మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. కాబట్టి ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

First Published:  21 Sep 2019 5:55 AM GMT
Next Story