Telugu Global
NEWS

చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్...

సినిమాల్లో చూపించినట్టే మానవత్వం మరిచిన నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు ఆస్పత్రికి వచ్చే చిన్న పిల్లలు కొందరి పై క్లినికల్ ట్రయల్స్ చేసిన దారుణం బయటపడింది. కార్పొరేట్ మందులు సరిగా పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికి కొందరు నీలోఫర్ ఆస్పత్రి వైద్యులకు భారీగా డబ్బు ఆశచూపి చిన్నపిల్లలకు ఆ మందులను వేసిన వైనం కలకలం రేపుతోంది. నీలోఫర్ ఆస్పత్రిలో డాక్టర్లు చేసిన ఈ దందా డాక్టర్ల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడం.. పరస్పరం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసుకోవడంతో ఈ […]

చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్...
X

సినిమాల్లో చూపించినట్టే మానవత్వం మరిచిన నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు ఆస్పత్రికి వచ్చే చిన్న పిల్లలు కొందరి పై క్లినికల్ ట్రయల్స్ చేసిన దారుణం బయటపడింది. కార్పొరేట్ మందులు సరిగా పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికి కొందరు నీలోఫర్ ఆస్పత్రి వైద్యులకు భారీగా డబ్బు ఆశచూపి చిన్నపిల్లలకు ఆ మందులను వేసిన వైనం కలకలం రేపుతోంది.

నీలోఫర్ ఆస్పత్రిలో డాక్టర్లు చేసిన ఈ దందా డాక్టర్ల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడం.. పరస్పరం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసుకోవడంతో ఈ దారుణం వెలుగుచూసింది.

ఫార్మా కంపెనీల నుంచి డాక్టర్లకు భారీ నజరానాలు , డబ్బులు అందడంతో వారంతా నీలోఫర్ లో చేరిన కొందరు పిల్లలపై ఫార్మా కంపెనీల మందులు ప్రయోగించినట్టు తెలిసింది. కొత్త మందులు, కొత్త వ్యాక్సిన్లను నీలోఫర్ వైద్యులు చిన్నారులపై ప్రయోగించారని సమాచారం.

ఈ క్రమంలోనే పోటాపోటీగా డబ్బులు తీసుకొని మందులను ప్రయోగించిన డాక్టర్ల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ విషయం పోలీస్ స్టేషన్ గడప తొక్కడంతో దారుణం వెలుగుచూసింది. చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడిన నీలోఫర్ వైద్యుల తీరుపై స్పందించిన తెలంగాణ సర్కారు తాజాగా విచారణకు ఆదేశించింది.

First Published:  27 Sep 2019 1:00 AM GMT
Next Story