Telugu Global
Cinema & Entertainment

మహేష్ కోసం 3 సెట్స్.. అన్నీ అక్కడే

ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమా కోసం 3 భారీ సెట్స్ నిర్మించారు. మూవీకి సంబంధించి దాదాపు 70శాతం షూటింగ్ ఈ 3 సెట్స్ లోనే జరుగుతుంది. మిగతా భాగాన్ని ఇప్పటికే జమ్ముకశ్మీర్ లో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఇక సెట్స్ విషయానికొస్తే.. ఈ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో కర్నూల్ కు చెందిన కొండారెడ్డి బురుజు సెట్ ను వేశాను. ఈ ఒక్క సెట్ కోసం నాలుగున్నర […]

మహేష్ కోసం 3 సెట్స్.. అన్నీ అక్కడే
X

ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమా కోసం 3 భారీ సెట్స్ నిర్మించారు. మూవీకి సంబంధించి దాదాపు 70శాతం షూటింగ్ ఈ 3 సెట్స్ లోనే జరుగుతుంది. మిగతా భాగాన్ని ఇప్పటికే జమ్ముకశ్మీర్ లో చిత్రీకరించిన సంగతి తెలిసిందే.

ఇక సెట్స్ విషయానికొస్తే.. ఈ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో కర్నూల్ కు చెందిన కొండారెడ్డి బురుజు సెట్ ను వేశాను. ఈ ఒక్క సెట్ కోసం నాలుగున్నర కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ సెట్ లోనే ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.

ఇక రెండో సెట్ ను హైదరాబాద్ శివార్లలో వేశారు. ఫామ్ హౌజ్ టైపులో ఉండే ఈ భారీ సెట్ కోసం ఏకంగా 4 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. విజయశాంతి, మహేష్ కు చెందిన కీలకమైన సన్నివేశాలన్నింటినీ ఈ సెట్ లోనే తీయబోతున్నారు.

ఇక మూడో సెట్ ను అన్నపూర్ణ స్టుడియోస్ లో వేశారు. ఇదొక ట్రయిన్ సెట్. ఈ సెట్ కోసం అక్షరాలా 3 కోట్ల రూపాయలు ఖర్చుచేశారు. ఈ సెట్ లో ఇప్పటికే షూటింగ్ పూర్తిచేశారు. మిగతా రెండు సెట్స్ లో ప్రస్తుతం షూటింగ్ నడుస్తోంది.

సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో సాంగ్స్ కోసం విదేశాలకు వెళ్లే కార్యక్రమాన్ని రద్దుచేసుకున్నారట. దాని బదులు రామోజీ ఫిలింసిటీ, అన్నపూర్ణ స్టుడియోస్ లోనే సెట్స్ వేసి సాంగ్స్ పూర్తిచేయాలని అనుకుంటున్నారు. అటు అనీల్ రావిపూడి మాత్రం కనీసం ఒక్క పాటకోసమైనా విదేశాలకు వెళ్లాల్సిందేనని పట్టుబడుతున్నాడుట. టైమ్ చూసుకొని ఆ షెడ్యూల్ ను ఖరారు చేస్తారు. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వస్తోంది సరిలేరు నీకెవ్వరు సినిమా.

First Published:  30 Sep 2019 3:14 AM GMT
Next Story