Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ టు మహేష్ వయా ప్రభాస్

కేజీఎఫ్ తో టోటల్ ఇండియాను ఆకర్షించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ తరహా స్క్రీన్ ప్లే కూడా రాసుకోవచ్చని ఇండియన్ మేకర్స్ కు చూపించాడు నీల్. ఇప్పుడీ దర్శకుడు కేజీఎఫ్-2 సినిమా చేస్తున్నాడు. అయితే ఇతడి కోసం టాలీవుడ్ హీరోలు మాత్రం చాన్నాళ్లుగా వెయిట్ చేస్తున్నారు. ఈ మేరకు గాసిప్స్ కూడా వెల్లువలా వస్తూ ఉన్నాయి. లేటెస్ట్ గాసిప్ ఏంటంటే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మహేష్ సినిమా. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ […]

ఎన్టీఆర్ టు మహేష్ వయా ప్రభాస్
X

కేజీఎఫ్ తో టోటల్ ఇండియాను ఆకర్షించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ తరహా స్క్రీన్ ప్లే కూడా రాసుకోవచ్చని ఇండియన్ మేకర్స్ కు చూపించాడు నీల్. ఇప్పుడీ దర్శకుడు కేజీఎఫ్-2 సినిమా చేస్తున్నాడు. అయితే ఇతడి కోసం టాలీవుడ్ హీరోలు మాత్రం చాన్నాళ్లుగా వెయిట్ చేస్తున్నారు. ఈ మేరకు గాసిప్స్ కూడా వెల్లువలా వస్తూ ఉన్నాయి. లేటెస్ట్ గాసిప్ ఏంటంటే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మహేష్ సినిమా.

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ మూవీ తర్వాత చేయాల్సిన సినిమాపై ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. లిస్ట్ లో సందీప్ రెడ్డి, వంశీ పైడిపల్లి లాంటి దర్శకులు ఉన్నప్పటికీ తాజాగా ప్రశాంత్ నీల్ కూడా వచ్చి చేరాడు. మహేష్ కు రీసెంట్ గా ఓ పాన్-ఇండియా స్టోరీలైన్ వినిపించాడట ప్రశాంత్ నీల్. ఆ సినిమాపై ప్రస్తుతం మహేష్ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే ఇదే ప్రశాంత్ నీల్ గతంలో ఎన్టీఆర్ కు ఓ స్టోరీ వినిపించినట్టు పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత ప్రభాస్ కు కూడా స్టోరీ చెప్పినట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడు మహేష్ కు కథ వినిపించాడంటూ మరో గాసిప్. వీటిలో ఏది నిజమో తెలియాలంటే.. కేజీఎఫ్-2 థియేటర్లలోకి వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

First Published:  14 Oct 2019 1:00 AM GMT
Next Story