Telugu Global
NEWS

రండి రామయ్య గారు " వైఎస్ వివేకా కేసులో సిట్ నోటీసులు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే పోలీసులపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలకు పోలీసుల సంఘం తీవ్రంగా స్పందించింది. ఇప్పుడు వైఎస్ వివేకా కేసులో వర్ల రామయ్యకు సిట్ నోటీసులు జారీ చేసింది. మీడియాతో మాట్లాడిన వర్ల రామయ్య…. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరన్నది పులివెందులలో అందరికీ తెలుసన్నారు. ఏ తలుపు తట్టి అడిగినా ఆ ఇంటి వారే హత్య చేశారని చెబుతారని […]

రండి రామయ్య గారు  వైఎస్ వివేకా కేసులో సిట్ నోటీసులు
X

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే పోలీసులపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలకు పోలీసుల సంఘం తీవ్రంగా స్పందించింది. ఇప్పుడు వైఎస్ వివేకా కేసులో వర్ల రామయ్యకు సిట్ నోటీసులు జారీ చేసింది.

మీడియాతో మాట్లాడిన వర్ల రామయ్య…. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరన్నది పులివెందులలో అందరికీ తెలుసన్నారు. ఏ తలుపు తట్టి అడిగినా ఆ ఇంటి వారే హత్య చేశారని చెబుతారని వ్యాఖ్యానించారు. వైఎస్‌ వివేకా కుమార్తె సునీతకు కూడా అసలు హంతకులు ఎవరో తెలుసన్నారు వర్ల రామయ్య.

ఈ నేపథ్యంలో కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌ బృందం వర్ల రామయ్య వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుంది. మీడియా సమావేశంలో వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు…. దర్యాప్తుకు ప్రభావితం అవడంతో పాటు అసలు హంతకులు ఎవరో వర్ల రామయ్యకు కూడా తెలిసినట్టుగా ఉందన్న నిర్దారణకు పోలీసులు వచ్చారు.

ఈ నేపథ్యంలోనే సీఆర్‌పీసీ 160కింద నోటీసులు జారీ చేశారు. తమ ముందు హాజరై ఆధారాలు ఏంటో చూపించాలని సూచించారు. వర్ల రామయ్య స్టేట్‌మెంట్‌ను కూడా సిట్ బృందం రికార్డు చేయబోతోంది.

First Published:  15 Oct 2019 7:40 PM GMT
Next Story