Telugu Global
NEWS

బైరెడ్డి మరో జంప్‌

మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరో జంప్ చేస్తున్నారు. కొద్దికాలంగా టీడీపీ వైపు ఉంటున్న బైరెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారు. బీజేపీలో చేరే అంశంపై అనుచరులతో చర్చించేందుకు ఈనెల 24న బైరెడ్డి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు, అమరావతి ఫ్రీజోన్ వంటి డిమాండ్లకు బీజేపీ కూడా సానుకూలంగా ఉన్నందున సీమ అభివృద్దే లక్ష్యంగా బీజేపీలో చేరుతున్నట్టు బైరెడ్డి చెబుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇక టీడీపీ కోలుకోవడం అయ్యేపని కాదని ఆయన విశ్వసిస్తున్నారు. […]

బైరెడ్డి మరో జంప్‌
X

మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరో జంప్ చేస్తున్నారు. కొద్దికాలంగా టీడీపీ వైపు ఉంటున్న బైరెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారు. బీజేపీలో చేరే అంశంపై అనుచరులతో చర్చించేందుకు ఈనెల 24న బైరెడ్డి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు, అమరావతి ఫ్రీజోన్ వంటి డిమాండ్లకు బీజేపీ కూడా సానుకూలంగా ఉన్నందున సీమ అభివృద్దే లక్ష్యంగా బీజేపీలో చేరుతున్నట్టు బైరెడ్డి చెబుతున్నారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇక టీడీపీ కోలుకోవడం అయ్యేపని కాదని ఆయన విశ్వసిస్తున్నారు. గతంలో బైరెడ్డి కుటుంబం కాంగ్రెస్‌లో ఉండేది. టీడీపీ వచ్చాక ఆ పార్టీలో చేరింది. రెండు సార్లు బైరెడ్డి నందికొట్కూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రాయలసీమ పరిరక్షణ సమితి ఏర్పాటుచేశారు. ఆ తర్వాత స్పందన లేకపోవడంతో దాన్ని మూసేశారు. కాంగ్రెస్‌లో చేరారు.

మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలికారు. కానీ స్థానికంగా బైరెడ్డి ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారు.

First Published:  20 Oct 2019 7:46 PM GMT
Next Story