Telugu Global
National

సామాజిక సేవలో... సాటిలేని 'మేఘా'

కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫా స్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు గ్రామాల రూపురేఖలనే మార్చేస్తున్నాయి. ఆపన్నులకు అండగా, అన్నం పెట్టే అన్నదాతకే తోడుగా, గొంతెండిపోయిన వారి దాహార్తిని తీరుస్తూ భగీరథుడిగా… ఇలా ఒక్కటేమిటి అన్ని రకాలుగా సేవలు అందిస్తూ సమాజ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తోంది మేఘా సంస్థ. ఆసుపత్రుల్లోని రోగులకు, వారి వెంట ఉండే బంధువులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది. క్యాన్సర్ బాధిత చిన్నారులను అక్కున చేర్చుకుని, వారికి […]

సామాజిక సేవలో... సాటిలేని మేఘా
X

కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫా స్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు గ్రామాల రూపురేఖలనే మార్చేస్తున్నాయి. ఆపన్నులకు అండగా, అన్నం పెట్టే అన్నదాతకే తోడుగా, గొంతెండిపోయిన వారి దాహార్తిని తీరుస్తూ భగీరథుడిగా… ఇలా ఒక్కటేమిటి అన్ని రకాలుగా సేవలు అందిస్తూ సమాజ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తోంది మేఘా సంస్థ.

ఆసుపత్రుల్లోని రోగులకు, వారి వెంట ఉండే బంధువులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది. క్యాన్సర్ బాధిత చిన్నారులను అక్కున చేర్చుకుని, వారికి మధ్యాహ్న భోజనంతోపాటు ఇతర సామగ్రిని అందిస్తోంది. నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లో అత్యాధునిక వసతులతో క్యాన్సర్ బాధితుల కోసం అంకాలజీ భవనాన్ని నిర్మించి ఇచ్చింది. అంతేకాదు అన్నదాతలకే అన్నం పెట్టే సద్దిమూట కార్యక్రమాన్ని కూడా ఎంఇఐఎల్ నిర్వహిస్తున్నది.

ప్రార్థించే పెదవుల కన్నా… సాయం చేసే చేతులు మిన్న అన్నారు మహనీయులు. వారి మాటలను నిజం చేస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది మేఘా సంస్థ. ఇంజనీరింగ్ రంగంలోనే నెంబర్ వన్ గా ఉంటూ… సామాజిక సేవలోనూ ఆదర్శంగా నిలుస్తోంది. చిన్న చిన్న సాయాలతోనే సరిపెట్టకుండా కొన్ని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతూ పెద్ద బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తోంది మేఘా సంస్థ.

మేఘా దత్తతలో గ్రామ వికాసం

పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుంది. పల్లెలు పచ్చగా ఉంటేనే అందరికీ అన్నం దొరుకుతుంది. పల్లెలు బాగుండాలంటే తలో చేయి వేయాలి. ఎన్నికల్లో గెలిచిన వారే గ్రామాలను పట్టించుకోని ఈ రోజుల్లో కేవలం సేవే పరమావధిగా పల్లెలను దత్తత తీసుకుంది మేఘా సంస్థ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక గ్రామాలను దత్తత తీసుకొని వాటి అభివృద్ధికి కృషి చేస్తోంది. గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా జములపల్లిని దత్తత తీసుకుంది ఎంఇఐఎల్. గ్రామంలో 40, 20 వేల కిలోలీటర్ల సామర్థ్యం ఉన్న రెండు ఓవర్ హెడ్ ట్యాంకులను ఆధునీకరించింది. ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తోంది. ఈ పథకంలో ఫెరల్ అనే ఆత్యాధునిక టెక్నాలజీని వాడింది. దీని ద్వారా ప్రతి ఇంటికీ ఒకే రకంగా (ప్రెషర్) తాగునీరు వస్తుంది. జములపల్లిలో 12 కేవీ సోలార్ ప్లాంట్ తో పాటు రెండు మినరల్ వాటర్ ప్లాంట్ లను ఎంఇఐఎల్ ఏర్పాటు చేసింది.

ఆదర్శ గ్రామం.. డోకిపర్రు

కృష్ణా జిల్లాలోని డోకిపర్రు, ఖాజా గ్రామాలను దత్తత తీసుకుంది మేఘా. ఈ రెండు గ్రామాల్లో ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీటిని పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తున్నది. డోకిపర్రులో కళ్యాణ మండపం, దేవాలయాన్ని నిర్మించింది. మరుగుదొడ్లను, వీధుల్లో సోలార్ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసింది. ఇదే గ్రామంలో రహదారులను ఏర్పాటు చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతోంది మేఘా సంస్థ. ఖాజాలో తాగునీటి కష్టాలను దూరం చేయడంతోపాటు రహదారులను ఏర్పాటు చేసింది. ఈ గ్రామంలో సోలార్ విద్యుత్ దీపాలతోపాటు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసిన మేఘా.

ప్రతి ఇంటికీ గ్యాస్

దక్షిణ భారతదేశంలోనే తొలి పీఎన్జీ గ్రామంగా డోకిపర్రు రికార్డ్ నెలకొల్పింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థ డోకిపర్రులో ఇంటింటికీ పైపుల ద్వారా గ్యాస్ సదుపాయాన్ని 2019 జనవరి నుంచి కల్పిస్తోంది. దీనివల్ల గ్రామస్తులకు తక్కువ ధరలో గ్యాస్ లభిస్తుందడంతోపాటు ఇది చాలా సురక్షితమైనది. తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలోని పస్పుల, మురహరిదొడ్డి గ్రామాలను దత్తత తీసుకుంది మేఘా సంస్థ. ఈ గ్రామాల్లో రహదారులను నిర్మించడంతో పాటు సౌర విద్యుత్ దీపాలను, 250 ఇళ్లల్లో మరుగుదొడ్లను ఏర్పాటు చేసింది. రాయలసీమలో నాగళాపురం, గంజిగుంటపల్లి గ్రామాలను సైతం దత్తత తీసుకుంది. ఈ గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో బల్లలు, డెస్కులను అందించింది. కళ్యాణ మండపాలు నిర్మించడంతోపాటు, పార్కులను ఏర్పాటు చేసింది.

పేదలకు రోజూ భోజనామృతం

ఆసుపత్రుల్లోని రోగులకు, వారి వెంట వచ్చే బంధువులకు మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు మేఘా భోజనామృతం కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. తొలివిడతలో హైదరాబాద్ లోని నీలోఫర్ చిన్నపిల్లల ఆసుపత్రితోపాటు ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో రోగులకు, వారి వెంట వచ్చే బంధువులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది. మలివిడతలో నిజామాబాద్, బోధన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల బంధువులకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పిస్తోంది మేఘా. ఒక్కో ఆసుపత్రిలో రోజుకు 400 మందికి భోజనాన్ని అందిస్తోంది. ఇలా సంవత్సరంలో దాదాపు 10 లక్షల మంది ఆకలి తీరుస్తున్నది మేఘా.

చిన్నారులకు బాసటగా

హైదరాబాద్ లోని ఎం.ఎన్.జే క్యాన్సర్ ఆసుపత్రిలోని చిన్నారులకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందిస్తోంది మేఘా సంస్థ. హైదరాబాద్ లోని ప్రాణం ఫౌండేషన్ కు చెందిన చిన్నారుల (ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న)కు మేఘా బాసటగా నిలుస్తోంది. వారికి వైద్యం అందిస్తోంది. వరంగల్ నగరంలో న్యూలైఫ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థకు చెందిన హెచ్ఐవీ బాధిత చిన్నారులకు భోజనం, ఇతర సదుపాయాలు కల్పిస్తోంది.

రైతన్నకు సద్దిమూట

అన్నం పెట్టే రైతన్నకే అండగా ఉంటోంది మేఘా సంస్థ. సద్దిమూట కార్యక్రమం ద్వారా వేలాది మంది రైతుల కడుపు నింపుతోంది. తమ పంటలను అమ్ముకునేందుకు వచ్చే రైతులు మార్కెట్ యార్డుల్లో ఎక్కువ సేపు గడపాల్సిన పరిస్థితి. ఈ స్థితిలో వారు ఆకలితోనే ఉండాల్సి వస్తోంది. అలాంటి వారి కడుపు నింపుతోంది మేఘా సంస్థ. సిద్దిపేట, గజ్వేల్ వంటి మామిడి మార్కెట్ యార్డ్ లలో రైతులు, హమాలీల ఆకలిని తీరుస్తోంది మేఘా.

కేన్సర్ బాధితుల కోసం రూ.5 కోట్లతో భవనం

నిమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాలతో అంకాలజీ ఆసుపత్రి భవనాన్ని మేఘా సంస్థ రూ.5 కోట్లతో నిర్మించింది. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా నిమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాలను మేఘా కల్పించింది. ఇందులో డాక్టర్, నర్సులకు వార్డులు, ఎమర్జన్సీ వార్డు, ల్యుకేమియా వార్డు, మహిళలు, పురుషులకు వార్డులతోపాటు పిల్లలకు కూడా ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. ఐసీయూ, బెడ్లు, ఆక్సీజన్ సదుపాయాలు, సెంట్రలైజ్డ్ ఏసీ సదుపాయం, బెడ్ లిఫ్ట్ లను మేఘా ఏర్పాటు చేసింది. 2018 సెప్టెంబర్ 23న అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, మంత్రి కే తారకరామారావు చేతుల మీదుగా అంకాలజీ భవనాన్ని ప్రారంభించారు.

First Published:  24 Oct 2019 10:02 AM GMT
Next Story