Telugu Global
NEWS

బీజేపీలోనే పురందేశ్వరి... రాజకీయాలకు దగ్గుబాటి గుడ్‌బై

భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారుడు హితేష్ వైసీపీలో ఉన్నప్పటికీ.. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తన భర్త దగ్గుబాటికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పటికీ… జగన్‌ ప్రభుత్వాన్ని బీజేపీలో ఉంటున్న పురందేశ్వరి ఆ మధ్య ఘాటుగా విమర్శించడం చర్చనీయాంశమైంది. దీనిపై వైసీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అదే సమయంలో పర్చూరు నియోజకవర్గంలో పలు మార్పులు జరిగాయి. భార్య, భర్త చెరో పార్టీలో ఉంటూ ఇలా విమర్శలు చేసుకోవడం సరికాదన్న భావన వైసీపీలో ఉంది. ఈ నేపథ్యంలో పలు ఊహాగానాలు […]

బీజేపీలోనే పురందేశ్వరి... రాజకీయాలకు దగ్గుబాటి గుడ్‌బై
X

భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారుడు హితేష్ వైసీపీలో ఉన్నప్పటికీ.. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తన భర్త దగ్గుబాటికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పటికీ… జగన్‌ ప్రభుత్వాన్ని బీజేపీలో ఉంటున్న పురందేశ్వరి ఆ మధ్య ఘాటుగా విమర్శించడం చర్చనీయాంశమైంది. దీనిపై వైసీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అదే సమయంలో పర్చూరు నియోజకవర్గంలో పలు మార్పులు జరిగాయి.

భార్య, భర్త చెరో పార్టీలో ఉంటూ ఇలా విమర్శలు చేసుకోవడం సరికాదన్న భావన వైసీపీలో ఉంది. ఈ నేపథ్యంలో పలు ఊహాగానాలు వచ్చాయి. పురందేశ్వరిని కూడా పార్టీలోకి తీసుకురావాల్సిందిగా జగన్‌ కోరారని వార్తలొచ్చాయి. అమెరికా నుంచి పురందేశ్వరి గురువారం హైదరాబాద్ వచ్చారు. ఆమె హైదరాబాద్ వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలపై కుటుంబసభ్యులు చర్చించుకున్నారు.

పురందేశ్వరి బీజేపీలోనే కొనసాగాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పురందేశ్వరిని బీజేపీలోనే కొనసాగించి తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిర్ణయించుకున్నారు. కుమారుడు హితేష్ రాజకీయ భవిష్యత్తు గురించి ఇప్పటి వరకు ఆలోచించినప్పటికీ… తన కోసం మీరు త్యాగాలు చేయవద్దని ఆయన తన తల్లిదండ్రులను కోరినట్టు చెబుతున్నారు. అనుచరులతో సమావేశం తర్వాత ఈ అంశంపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్పందించనున్నారు.

First Published:  25 Oct 2019 8:34 PM GMT
Next Story