Telugu Global
Cinema & Entertainment

ఘనంగా ప్రారంభమైన "రెడ్"

రామ్ హీరోగా చేయబోతున్న రీమేక్ ప్రాజెక్టు రెడ్ ఘనంగా ప్రారంభమైంది. తనకు ఇస్మార్ట్ శంకర్ రూపంలో భారీ విజయాన్నందించిన పూరి జగన్నాధ్ ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించాడు రామ్. అటు పూరి తను ఒక్కడే రాకుండా, చార్మిని కూడా వెంటేసుకొని వచ్చాడు. అలా పూరి, చార్మి క్లాప్ తో రెడ్ సినిమా అధికారికంగా ప్రారంభమైంది. జెమినీ కిరణ్ ఈ సినిమాకు కెమెరా స్విచాన్ చేశారు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై రాబోతోంది రెడ్ ప్రాజెక్టు. […]

ఘనంగా ప్రారంభమైన రెడ్
X

రామ్ హీరోగా చేయబోతున్న రీమేక్ ప్రాజెక్టు రెడ్ ఘనంగా ప్రారంభమైంది. తనకు ఇస్మార్ట్ శంకర్ రూపంలో భారీ విజయాన్నందించిన పూరి జగన్నాధ్ ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించాడు రామ్. అటు పూరి తను ఒక్కడే రాకుండా, చార్మిని కూడా వెంటేసుకొని వచ్చాడు. అలా పూరి, చార్మి క్లాప్ తో రెడ్ సినిమా అధికారికంగా ప్రారంభమైంది. జెమినీ కిరణ్ ఈ సినిమాకు కెమెరా స్విచాన్ చేశారు.

స్రవంతి మూవీస్ బ్యానర్ పై రాబోతోంది రెడ్ ప్రాజెక్టు. కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకుడు. గతంలో రామ్, కిషోర్ తిరుమల కాంబినేషన్ లో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలొచ్చాయి. ఇది వీళ్లిద్దరి కాంబోలో మూడో సినిమా కానుంది. గత రెండు సినిమాలకు భిన్నంగా ఇది ఉండబోతోంది. లవ్ ఎలిమెంట్స్ చాలా తక్కువ. పూర్తిగా యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ లో సినిమా ఉంటుంది. రామ్ గెటప్ కూడా రఫ్ గా ఉంది. చిన్న హెయిర్ స్టయిల్, దట్టమైన గడ్డంతో రామ్ ఫస్ట్ లుక్ ను ఇదివరకే రిలీజ్ చేశారు.

ఈ సినిమాతో మరోసారి మణిశర్మకు ఛాన్స్ ఇచ్చాడు రామ్. ఇస్మార్ట్ శంకర్ తో మణిశర్మ టాలెంట్ రామ్ కు తెలిసొచ్చింది. అందుకే మళ్లీ రిపీట్ చేశాడు. గమ్మత్తైన విషయం ఏంటంటే.. స్రవంతి మూవీస్ బ్యానర్ పై మణిశర్మకు ఇదే తొలి చిత్రం. దశాబ్దాలుగా పరిశ్రమలో కొనసాగుతున్న వీళ్లిద్దరూ ఇన్నాళ్లూ కలిసి ఒక సినిమా కూడా చేయలేదంటే కాస్త ఆశ్చర్యమే కదా.

First Published:  30 Oct 2019 10:32 AM GMT
Next Story