Telugu Global
National

ధర్మాడి సత్యంకు వైఎస్‌ఆర్ లైఫ్‌టైమ్ అవార్డు ప్రకటించిన జగన్‌

గోదావరి నదిలో కచ్చులూరు వద్ద మునిగిపోయిన బోటును వెలికితీయడంలో విజయం సాధించిన ధర్మాడి సత్యానికి ఏపీ ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైమ్ అవార్డును ప్రకటించింది. ఈ విషయాన్ని మంత్రి కన్నబాబు వెల్లడించారు. ధర్మాడి సత్యంకు వైఎస్‌ఆర్ లైఫ్‌ టైం అవార్డు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ఆదేశించారని మంత్రి వివరించారు. అసమాన్య పనిచేసిన ఒక సామాన్య వ్యక్తికి ఈ తరహా అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారని మంత్రి వివరించారు. వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైమ్ అవార్డులను […]

ధర్మాడి సత్యంకు వైఎస్‌ఆర్ లైఫ్‌టైమ్ అవార్డు ప్రకటించిన జగన్‌
X

గోదావరి నదిలో కచ్చులూరు వద్ద మునిగిపోయిన బోటును వెలికితీయడంలో విజయం సాధించిన ధర్మాడి సత్యానికి ఏపీ ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైమ్ అవార్డును ప్రకటించింది. ఈ విషయాన్ని మంత్రి కన్నబాబు వెల్లడించారు.

ధర్మాడి సత్యంకు వైఎస్‌ఆర్ లైఫ్‌ టైం అవార్డు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి ఆదేశించారని మంత్రి వివరించారు. అసమాన్య పనిచేసిన ఒక సామాన్య వ్యక్తికి ఈ తరహా అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారని మంత్రి వివరించారు.

వైఎస్‌ఆర్‌ లైఫ్‌టైమ్ అవార్డులను ప్రాదానం చేయాలన్న నిర్ణయానికి నిన్న కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ అవార్డు కింద ప్రశంస పత్రంతో పాటు 10 లక్షల నగదు ఇస్తారు. వివిధ రంగాల్లో ప్రజాసేవ చేసిన వారికి ఈ అవార్డును ఇస్తారు. ఏటా రెండు విడతల్లో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. రిపబ్లిక్ డే రోజు 50 మందికి, స్వాతంత్ర్య దినోత్సవం నాడు మరో 50 మందికి ఈ అవార్డును ఇస్తారు.

First Published:  31 Oct 2019 4:27 AM GMT
Next Story