Telugu Global
National

ఆంధ్రుల మెగా స్వప్నాన్ని నిజం చేస్తున్న 'మేఘా'

ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నం పోలవరం. ఆ కలను సాక్షాత్కారం చేయబోతోంది మేఘా ఇంజనీరింగ్. దశాబ్దాల తరబడి పెండింగ్ లో వున్న పోలవరం ప్రాజెక్టు ను రెండేళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని నూతన సంకల్పానికి మేఘా శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా అత్యంత క్లిష్టమైన ప్రాజెక్ట్ లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తిచేస్తూ రికార్డులు సాధిస్తున్న మేఘా ఇంజనీరింగ్ సంస్త ఇప్పుడు పోలవరంను కూడా లక్ష్యం మేరకు నిర్మించేందుకు […]

ఆంధ్రుల మెగా స్వప్నాన్ని నిజం చేస్తున్న మేఘా
X

ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నం పోలవరం.

ఆ కలను సాక్షాత్కారం చేయబోతోంది మేఘా ఇంజనీరింగ్.

దశాబ్దాల తరబడి పెండింగ్ లో వున్న పోలవరం ప్రాజెక్టు ను రెండేళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని నూతన సంకల్పానికి మేఘా శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా అత్యంత క్లిష్టమైన ప్రాజెక్ట్ లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తిచేస్తూ రికార్డులు సాధిస్తున్న మేఘా ఇంజనీరింగ్ సంస్త ఇప్పుడు పోలవరంను కూడా లక్ష్యం మేరకు నిర్మించేందుకు తన ఇంజనీరింగ్ నైపుణ్యంతో పనులు ప్రారంభించింది.

ఈ ప్రాజెక్టును కాళేశ్వరం తరహాలో యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి జగన్ పట్టుదలతో ఉన్నారు. అందువల్లనే గత ప్రభుత్వంలో నత్తనడకన పనులు చేయడం వల్ల వాటిని రద్దు చేసి మొత్తం ఒకేపనిగా టెండరును పిలిచారు.

రెండేళ్లలో మొత్తం ప్రాజెక్టు పూర్తికావాలనేది జగన్ ఆకాంక్ష, లక్ష్యం. తెలంగాణ లో కాళేశ్వరం లాంటి చారిత్రాత్మక ప్రాజెక్ట్ నిర్మించిన అనుభవంతో ఆంధ్రప్రదేశ్ లోనూ జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని ఒప్పంద గడువు ప్రకారం పూర్తి చేసి రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చేందుకు సిద్ధమవుతోంది మేఘా.

ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2005లో పనులు ప్రారంభిస్తూ హెడ్వర్క్స్, కుడి, ఎడమ కాలువ పనులను ప్యాకేజ్ ల వారిగా అప్పగించారు. అదే సమయంలో ఆయన కీలకమైన అన్ని అనుమతులను కేంద్రం నుంచి సాధించారు.

పోలవరం పూర్తికి తొలగిన అడ్డంకులు

పోలవరం పనులు చేపట్టేందుకు అడ్డంకిగా ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేయడంతో పనులు చేయడానికి మార్గం సుగమం అయ్యింది. అక్టోబర్ 31న హైకోర్టు పోలవరం పనులు ప్రారంభించేందుకు అనుకూలంగా తీర్పునివ్వడంతో శుక్రవారం (నవంబర్ 1) రోజున స్పిల్‌ వే బ్లాక్‌ నంబర్‌ 18 వద్ద మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ డిజిఎం ఎ. వెంకట సతీష్‌, మేనేజర్‌ పమ్మీ మురళి, జలవనరుల శాఖ ఈఈ ఏసుబాబు సమక్షంలో భూమి పూజ నిర్వహించారు.

పోలవరం ప్రాజెక్ట్ లాభాలు ఇవే

పోలవరం పూర్తవ్వడం వలన 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. 80 టీఎంసీల గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజ్ ఎగువన కృష్ణా నదికి తరలించటం జరుగుతుంది. 23.44 టీఎంసీల నీటిని విశాఖపట్నం నగర తాగునీటి అవసరాల నిమిత్తం తరలించ వచ్చు. పోలవరం కాలువకు అనుకుని ఉన్న 540 గ్రామాల్లోని 28.5 లక్షల మంది ప్రజల దాహార్తిని తీరుతుంది.

రివర్స్ టెండరింగ్ తో 628కోట్ల ఆదా

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలవరం పనులను రద్దు చేసి రివర్స్ టెండర్ కు వెళ్లింది. పోలవరం హెడ్ వర్క్ తో పాటు జల విద్యుత్ కేంద్రాలను కలిపి ప్రభుత్వం రివర్స్ టెండర్ పిలిచింది. ఈ టెండర్లో మేఘా ఇంజనీరింగ్ గతంలో పనులు చేపట్టిన సంస్థల కంటే తక్కువ శాతంకు (-12.6%) పనులు చేపట్టేందుకు అంగీకారం తెలిపింది‌.

రివర్స్ టెండరింగ్ వల్ల ఏపి ప్రభుత్వానికి 628 కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి . ఈ ప్రాజెక్టు లో జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ. 4987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా ఆ పనికి మేఘా ఇంజనీరింగ్ ఒక్కటే 4358 మొత్తానికి టెండర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఏపి ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా ఈ ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కలల ప్రాజెక్ట్ , బహుళార్ధ సాధక పోలవరంను పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో మేఘా ముందడుగు వేసింది.

ఏక కాలం లో రిజర్వాయర్ పనులు, జల విద్యుత్ కేంద్రం పనులు

సర్వే, వనరుల సమీకరణ ముఖ్యంగా ఇంజనీరింగ్ యంత్రాంగం, యంత్ర సామాగ్రితో పాటు అవసరమైన ముడిసరుకు తదితర పనులను మేఘా ఇప్పటికే చురుగ్గా చేపట్టింది. వరదలు దాదాపు నిలిచిపోవడంతో పనులు ప్రారంభించడం కూడా సులభం కానుంది. గతంలో ప్రధాన జలాశయం పనులు కొంతమేర జరిగినప్పటికీ జల విద్యుత్ కేంద్రం పనులు మాత్రం ఏమాత్రం ముందుకు సాగలేదు. ప్రారంభదశలోనే ఉన్నాయి.

ఓ వైపు ప్రధాన రిజర్వాయర్ పనులు, మరోవైపు జల విద్యుత్ కేంద్రం పనులు ఏకకాలంలో చేపడుతోంది మేఘా.

First Published:  1 Nov 2019 3:39 AM GMT
Next Story