Telugu Global
NEWS

వలసల భర్తీలు.... బాబు మొదలు పెట్టాడు....

టీడీపీ నుంచి వలస వెళ్లిన నేతల స్థానంలో కొత్త వారితో భర్తీ చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలిసింది. టీడీపీ సీనియర్ నేత వల్లభనేని వంశీ టిడిపిని విడిచిపెట్టినందున, ఆయన స్థానంలో మరో నేతను గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో భర్తీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గద్దె అనురాధను గన్నవరానికి పంపాలని తెలుగు దేశం పార్టీ మొదట్లో నిర్ణయించింది. గద్దె రామ్మోహన్ భార్య అనురాధ…. కృష్ణ జిల్లా జెడ్‌పి మాజీ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఈమె […]

వలసల భర్తీలు.... బాబు మొదలు పెట్టాడు....
X

టీడీపీ నుంచి వలస వెళ్లిన నేతల స్థానంలో కొత్త వారితో భర్తీ చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలిసింది. టీడీపీ సీనియర్ నేత వల్లభనేని వంశీ టిడిపిని విడిచిపెట్టినందున, ఆయన స్థానంలో మరో నేతను గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో భర్తీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

గద్దె అనురాధను గన్నవరానికి పంపాలని తెలుగు దేశం పార్టీ మొదట్లో నిర్ణయించింది. గద్దె రామ్మోహన్ భార్య అనురాధ…. కృష్ణ జిల్లా జెడ్‌పి మాజీ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఈమె కుటుంబానికి గన్నవరంలో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఆమె భర్త, రామమోహన్ 1994 లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసి గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తరువాత టిడిపిలో చేరారు.

తరువాత 1999 లో విజయవాడ లోక్ సభ నియోజకవర్గానికి గద్దె రామ్మోహన్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తరువాత విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్లారు. 2009 ఎన్నికలలో ప్రజా రాజ్యం పార్టీ తరుఫున పోటీచేసి ఓడిపోయారు. 2014లో టీడీపీలో చేరి 2019 ఎన్నికలలో గెలిచాడు.

గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ కుటుంబానికి బలమైన మద్దతు ఉంది. వంశీ స్థానంలో రామ్మోహన్ భార్య అనురాధ అభ్యర్థిత్వాన్ని టిడిపి పరిశీలిస్తున్నట్టు తెలిసింది.

ఇక ఈమెకు పోటీగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ను గన్నవరానికి పంపాలని పార్టీ నాయకత్వానికి కొన్ని సూచనలు అందినట్టు తెలిసింది.

మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ గుడివాడలో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయాడు. తనకు విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ సీటును కేటాయించి గద్దె కుటుంబాన్ని గన్నవరానికి పంపాలని అవినాష్ నాయకత్వాన్ని కోరుతున్నట్టు తెలిసింది.

అయితే, గద్దె రామ్మోహన్ విజయవాడ ఈస్ట్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చడం కంటే అవినాష్ ను గన్నవరానికి పంపాలని పార్టీ భావిస్తోంది.

అయితే, అవినాష్ గన్నవరానికి వెళ్లడానికి అనుకూలంగా లేనట్టు తెలిసింది. గద్దె కుటుంబాన్ని పంపడంపై నాయకత్వానికి రెండో ఆలోచన లేకపోవడంతో ఈ పీఠముడి కొనసాగుతోంది.

First Published:  4 Nov 2019 12:41 AM GMT
Next Story