Telugu Global
NEWS

బీజేపీలో చేరనున్న మోత్కుపల్లి..?

ఒకప్పుడు టీడీపీలో ఒక వెలుగు వెలిగిన తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహులు గత కొన్నాళ్లుగా సైలెంట్ అయిపోయారు. తెలుగుదేశం పార్టీని వీడిన మోత్కుపల్లి ఆ తర్వాత ఏ పార్టీలోనూ చేరలేదు. పార్టీ వీడే సమయంలో చంద్రబాబుపై పలు ఆరోపణలు చేశారు. తనకు గవర్నర్ పదవి ఇప్పిస్తానని చంద్రబాబు మోసం చేశారని కూడా ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎల్ఎఫ్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. కాగా, తాజాగా […]

బీజేపీలో చేరనున్న మోత్కుపల్లి..?
X

ఒకప్పుడు టీడీపీలో ఒక వెలుగు వెలిగిన తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహులు గత కొన్నాళ్లుగా సైలెంట్ అయిపోయారు. తెలుగుదేశం పార్టీని వీడిన మోత్కుపల్లి ఆ తర్వాత ఏ పార్టీలోనూ చేరలేదు. పార్టీ వీడే సమయంలో చంద్రబాబుపై పలు ఆరోపణలు చేశారు. తనకు గవర్నర్ పదవి ఇప్పిస్తానని చంద్రబాబు మోసం చేశారని కూడా ఆరోపించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎల్ఎఫ్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన రాజకీయంగా సైలెంట్ అయిపోయారు.

కాగా, తాజాగా మోత్కుపల్లి బీజేపీలో చేరతారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా మోత్కుపల్లి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. దాదాపు రెండు గంటల సేపు మోత్కుపల్లితో వీరిద్దరూ భేటీ అయ్యారు. తమ పార్టీలోకి రావాలని.. మీ రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని వారు మోత్కుపల్లికి చెప్పినట్లు సమాచారం. దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందించారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

ఈ వారంలోనే ఆయన బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఆయన టీఆర్ఎస్‌లో చేరడానికి ప్రయత్నించినా.. అటువైపు నుంచి పెద్దగా సానుకూల స్పందన లేకపోవడంతో విరమించుకున్నారు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతుండటంతో అటువైపు వెళ్లడానికి మొగ్గు చూపినట్లు తెలుస్తున్నాయి.

First Published:  3 Nov 2019 10:34 PM GMT
Next Story