Telugu Global
NEWS

టీ-20ల్లో ధోనీ రికార్డును అధిగమించిన రోహిత్ శర్మ

99 టీ-20లతో రోహిత్ శర్మ రికార్డు ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును…డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ అధిగమించాడు. న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ ద్వారా..అత్యధిక టీ-20మ్యాచ్ లు ఆడిన భారత క్రికెటర్ గా రోహిత్ రికార్డుల్లో చేరాడు. రోహిత్ శర్మ తన కెరియర్ లో 99 మ్యాచ్ ల మైలురాయిని చేరాడు. మాజీ […]

టీ-20ల్లో ధోనీ రికార్డును అధిగమించిన రోహిత్ శర్మ
X
  • 99 టీ-20లతో రోహిత్ శర్మ రికార్డు

ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును…డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ అధిగమించాడు.

న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ ద్వారా..అత్యధిక టీ-20మ్యాచ్ లు ఆడిన భారత క్రికెటర్ గా రోహిత్ రికార్డుల్లో చేరాడు. రోహిత్ శర్మ తన కెరియర్ లో 99 మ్యాచ్ ల మైలురాయిని చేరాడు.

మాజీ కె్ప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మొత్తం 98 మ్యాచ్ లతో అత్యధిక టీ-20 మ్యాచ్ లు ఆడిన భారత క్రికెటర్ గా నిలిచాడు.

2007 టు 2019

2007లో డర్బన్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్ ద్వారా టీ-20 అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ గత 12 సంవత్సరాల కాలంలో..ప్రస్తుత బంగ్లా సిరీస్ లోని ఢిల్లీ పోటీ వరకూ 99 మ్యాచ్ లు ఆడి నాలుగు సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలతో సహా 2వేల 452 పరుగులు సాధించాడు.32.14 సగటు నమోదు చేశాడు.

విరాట్ కొహ్లీ పేరుతో ఉన్న 2450 పరుగుల రికార్డును సైతం రోహిత్ శర్మ తెరమరుగు చేశాడు.

విరాట్ కేవలం 72 మ్యాచ్ ల్లోనే 2 వేల 450 పరుగులు సాధిస్తే…రోహిత్ శర్మ 99 మ్యాచ్ ల్లో 2452 పరుగులు సాధించగలిగాడు.

రోహిత్, ధోనీల తర్వాత అత్యధిక టీ-20 మ్యాచ్ లు ఆడిన భారత క్రికెటర్ల వరుసలో సురేశ్ రైనా (78), విరాట్ కొహ్లీ ( 72), యువరాజ్ సింగ్ ( 58 ), శిఖర్ ధావన్ ( 55 ) ఉన్నారు.

టీ-20 క్రికెట్ చరిత్రలో అత్యధికంగా 111 మ్యాచ్ లు ఆడిన ఘనత పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ పేరుతో ఉంది.

రాజ్ కోట వేదికగా నవంబర్ 7న బంగ్లాదేశ్ తో జరిగే రెండో టీ-20 మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ…100 మ్యాచ్ ల ఘనతను సొంతం చేసుకోగలుగుతాడు.

First Published:  3 Nov 2019 7:53 PM GMT
Next Story