Telugu Global
NEWS

చైనా ఓపెన్ తొలిరౌండ్లోనే సింధుకు షాక్

ప్రపంచ టైటిల్ తర్వాత వరుసగా ఐదో ఓటమి ప్రపంచ చాంపియన్ పీవీ సింధు పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. చైనా ఓపెన్ సూపర్ సిరీస్ తొలిరౌండ్లోనే సింధు ఓటమి పాలయ్యింది. చైనీస్ తైపీ ప్లేయర్ తై యూ పేతో జరిగిన మూడుగేమ్ ల పోరులో సింధు 13-21, 21-18, 19-21తో పరాజయం చవిచూసింది. తొలిగేమ్ ను 13-21తో చేజార్చుకొన్న సింధు…రెండో గేమ్ లో పుంజుకొని ఆడి 21-18తో నెగ్గి 1-1తో సమఉజ్జీగా నిలిచింది. నిర్ణయాత్మక ఆఖరి గేమ్ […]

చైనా ఓపెన్ తొలిరౌండ్లోనే సింధుకు షాక్
X
  • ప్రపంచ టైటిల్ తర్వాత వరుసగా ఐదో ఓటమి

ప్రపంచ చాంపియన్ పీవీ సింధు పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. చైనా ఓపెన్ సూపర్ సిరీస్ తొలిరౌండ్లోనే సింధు ఓటమి పాలయ్యింది.

చైనీస్ తైపీ ప్లేయర్ తై యూ పేతో జరిగిన మూడుగేమ్ ల పోరులో సింధు 13-21, 21-18, 19-21తో పరాజయం చవిచూసింది.

తొలిగేమ్ ను 13-21తో చేజార్చుకొన్న సింధు…రెండో గేమ్ లో పుంజుకొని ఆడి 21-18తో నెగ్గి 1-1తో సమఉజ్జీగా నిలిచింది.
నిర్ణయాత్మక ఆఖరి గేమ్ నువ్వానేనా అన్నట్లుగా సాగింది.

గేమ్ ప్రారంభంలో సింధు ఆధిక్యం కొనసాగించినా…ఆ తర్వాత ప్రత్యర్థి దూకుడుగా ఆడి 21-19తో గేమ్ ను, 2-1తో మ్యాచ్ ను సొంతం చేసుకొంది.

ప్రపంచ టైటిల్ విజయం తర్వాత..సూపర్ సిరీస్ టోర్నీల ప్రారంభరౌండ్లలోనే నిష్క్ర్రమించడం సింధుకు ఇది వరుసగా ఐదోసారి.
ప్రణయ్ కు తొలిరౌండ్ షాక్… పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో సైతం భారత ఆటగాడు ప్రణయ్ కు పరాజయం తప్పలేదు. డెన్మార్క్ ఆటగాడు రాస్ ముస్ జెమ్కీ వరుస గేమ్ ల్లో ప్రణయ్ ను చిత్తు చేశాడు.

మిక్సిడ్ డబుల్స్ లో మాత్రం భారత జోడీ అశ్వని-రంకిరెడ్డి జోడీ తొలివిజయం నమోదు చేశారు.

First Published:  6 Nov 2019 4:50 AM GMT
Next Story