Telugu Global
NEWS

టీ-20 సిరీస్ లో భారత మహిళల క్లీన్ స్వీప్

కరీబియన్ గడ్డపై 5-0తో విజయం టీ-20 ప్రపంచకప్ కు సన్నాహకంగా కరీబియన్ ద్వీపాలు వేదికగా వెస్టిండీస్ తో ముగిసిన ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని  భారత జట్టు క్లీన్ స్వీప్ సాధించింది. 5-0తో విండీస్ ను చిత్తు చేయడం ద్వారా విజేతగా నిలిచింది. ఆఖరి టీ-20లో జేమీమా రోడ్రిగేస్, వేదా హాఫ్ సెంచరీలు సాధించడంతో భారత్ 61 పరుగులతో కరీబియన్ టీమ్ ను చిత్తు చేయగలిగింది. భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు […]

టీ-20 సిరీస్ లో భారత మహిళల క్లీన్ స్వీప్
X
  • కరీబియన్ గడ్డపై 5-0తో విజయం

టీ-20 ప్రపంచకప్ కు సన్నాహకంగా కరీబియన్ ద్వీపాలు వేదికగా వెస్టిండీస్ తో ముగిసిన ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు క్లీన్ స్వీప్ సాధించింది. 5-0తో విండీస్ ను చిత్తు చేయడం ద్వారా విజేతగా నిలిచింది.

ఆఖరి టీ-20లో జేమీమా రోడ్రిగేస్, వేదా హాఫ్ సెంచరీలు సాధించడంతో భారత్ 61 పరుగులతో కరీబియన్ టీమ్ ను చిత్తు చేయగలిగింది. భారత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 134 పరుగులు సాధించింది.

135 పరుగుల స్కోరుతో చేజింగ్ కు దిగిన కరీబియన్ టీమ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 71 పరుగులు మాత్రమే చేయగలిగింది.
వన్డే సిరీస్ ను 2-1తో సొంతం చేసుకొన్న భారతజట్టు చివరకు టీ-20 సిరీస్ ను సైతం 5-0 గెలుపుతో ముగించడం విశేషం.

First Published:  21 Nov 2019 10:00 PM GMT
Next Story