Telugu Global
National

నటుడు భాగ్యరాజాపై చర్యలకు వాసిరెడ్డి పద్మ లేఖ

తమిళ దర్శకుడు, నటుడు భాగ్యరాజాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఇందుకోసం తమిళనాడు మహిళా కమిషన్‌కు వాసిరెడ్డి పద్మ లేఖ రాశారు. రేప్ ల విషయంలో మహిళలను తప్పుపట్టేలా భాగ్యరాజా చేసిన వ్యాఖ్యలు క్షమించరానివని ఆమె అభిప్రాయపడ్డారు. భాగ్యరాజా ఏమాత్రం మానవత్వం లేకుండా వ్యాఖ్యలు చేశారని… రేప్ ల విషయలో మహిళలను తప్పుపడుతున్న భాగ్యరాజాకు చిన్నపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. […]

నటుడు భాగ్యరాజాపై చర్యలకు వాసిరెడ్డి పద్మ లేఖ
X

తమిళ దర్శకుడు, నటుడు భాగ్యరాజాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఇందుకోసం తమిళనాడు మహిళా కమిషన్‌కు వాసిరెడ్డి పద్మ లేఖ రాశారు. రేప్ ల విషయంలో మహిళలను తప్పుపట్టేలా భాగ్యరాజా చేసిన వ్యాఖ్యలు క్షమించరానివని ఆమె అభిప్రాయపడ్డారు.

భాగ్యరాజా ఏమాత్రం మానవత్వం లేకుండా వ్యాఖ్యలు చేశారని… రేప్ ల విషయలో మహిళలను తప్పుపడుతున్న భాగ్యరాజాకు చిన్నపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆపేందుకు వ్యవస్థలు, సంఘాలు ప్రయత్నిస్తుంటే కొందరు సెలబ్రిటీలు మాత్రం మహిళలను కించపరచడం, దారుణాలకు మద్దతు పలుకడమేమిటని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.

తమిళనాడులో ఇటీవల ప్రకంపనలు సృష్టించిన పొలాచీ రేప్‌ కేసు గురించి భాగ్యరాజా ఓ సినీ ఈవెంట్‌లో ప్రస్తావిస్తూ.. ఆ ఘటన వెనుక మగవాళ్ల తప్పులేదని వ్యాఖ్యానించాడు. వివాహేతర సంబంధాల కోసమే ఈ రోజుల్లో మహిళలు భర్తలను, పిల్లలను చంపుతున్నారని దారుణ వ్యాఖ్యలు చేశారు.

సెల్‌ఫోన్‌ల వల్లే మహిళలు చెడిపోతున్నారని, రెండేసి సిమ్‌ కార్డులు వాడుతున్నారని, మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు కూడా సెల్‌ఫోన్లు కారణమని వ్యాఖ్యలు చేశారు.

పొలాచీ కేసులో అమ్మాయి అవకాశం ఇవ్వడం వల్లే రేప్‌ జరిగిందని భాగ్యరాజా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆయనపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి.

First Published:  28 Nov 2019 5:08 AM GMT
Next Story