Telugu Global
NEWS

నూర్ సుల్తాన్ వేదికగా నేటినుంచే దాయాదుల సమరం

డేవిస్ కప్ లో భారత్ తో పాకిస్థాన్ ఢీ చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ జట్ల డేవిస్ కప్ పోరుకు…కజకిస్థాన్ రాజధాని నూర్ సుల్తాన్ వేదికగా కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. గత నెలరోజులుగా వేదికపై కొనసాగిన సస్పెన్స్ ఎట్టకేలకు వీడటంలో తటస్థ వేదికపై సమరానికి రెండుజట్లూ సై అంటే సై అంటున్నాయి. వాస్తవానికి పాక్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా నవంబర్ 29, 30 తేదీలలో జరగాల్సిన ఈ మ్యాచ్ ను …తటస్థ వేదికలో నిర్వహించాలన్న భారత అభ్యర్థన […]

నూర్ సుల్తాన్ వేదికగా నేటినుంచే దాయాదుల సమరం
X
  • డేవిస్ కప్ లో భారత్ తో పాకిస్థాన్ ఢీ

చిరకాల ప్రత్యర్థులు భారత్- పాక్ జట్ల డేవిస్ కప్ పోరుకు…కజకిస్థాన్ రాజధాని నూర్ సుల్తాన్ వేదికగా కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది.

గత నెలరోజులుగా వేదికపై కొనసాగిన సస్పెన్స్ ఎట్టకేలకు వీడటంలో తటస్థ వేదికపై సమరానికి రెండుజట్లూ సై అంటే సై అంటున్నాయి.

వాస్తవానికి పాక్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా నవంబర్ 29, 30 తేదీలలో జరగాల్సిన ఈ మ్యాచ్ ను …తటస్థ వేదికలో నిర్వహించాలన్న భారత అభ్యర్థన మేరకు… కజకిస్థాన్ రాజధాని నూర్ సుల్తాన్ లో నిర్వహించాలని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ఆదేశించింది.

యువఆటగాళ్ల సమరం

రోహిత్ రాజ్ పాల్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్ గా ఏడుగురు సభ్యులజట్టుతో భారత్ బరిలోకి దిగనుంది. మహేశ్ భూపతితో సహా పలువురు సీనియర్లు భద్రతా కారణాలతో పాక్ తో మ్యాచ్ కు దూరం కాగా వెటరన్ లియాండర్ పేస్ తో సహా పలువురు యువఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించారు.

మరోవైపు పాక్ జట్టులో ఇద్దరు టీనేజ్ ప్లేయర్లకు తొలిసారిగా చోటు కల్పించారు. సీనియర్ ప్లేయర్లు ఖురేషీ, అఖీల్ ఖాన్ జట్టు నుంచి ఉపసంహరించుకోగా.. అబ్దుల్ రెహ్మాన్, షోయబ్ ఖాన్ లకు చోటు కల్పించారు.

అంతర్జాతీయ టెన్నిస్ సంఘం ర్యాంకింగ్స్ ప్రకారం..రెహ్మాన్ 446, షోయబ్ ఖాన్ 1004 ర్యాంకర్లుగా ఉన్నారు. ఈ పోటీలో భారత్ సైతం యువఆటగాళ్లతో పోరుకు సిద్దమైనా..హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది.

13 ఏళ్ల తర్వాత పాక్ తో పోరు…

డేవిస్ కప్… ఆసియా-ఓషియానా జోన్ తొలిరౌండ్లో భారత్- పాక్ జట్లు 13 సంవత్సరాల విరామం తర్వాత..ఢీ కొనబోతున్నాయి. 2006లో చివరిసారిగా తలపడిన భారత్, పాక్ జట్లు… మరోసారి సై అంటే సై అంటున్నాయియ
డేవిస్ కప్ టోర్నీలో మాజీ రన్నరప్ భారత్ పరిస్థితి వైకుంఠపాళీలో నిచ్చెనలా మారింది.

ప్రపంచ గ్రూప్ పోటీలలో చోటు నిలుపుకోలేకపోయిన భారత్…ఇటలీ జట్టు చేతిలో ఓటమితో మరోసారి…ఆసియా-ఓషియానా జోన్ స్థాయికి పడిపోయింది.

ప్రపంచ గ్రూపులో చోటు దక్కించుకోవాలంటే భారత్ మరోసారి…జోనల్ రౌండ్ నుంచి పోటీకి దిగాల్సి ఉంది. 1964లో చివరిసారిగా పాక్ గడ్డపై డేవిస్ కప్ మ్యాచ్ ల్లో పాల్గొన్న భారత్…2006లో ముంబై వేదికగా ముగిసిన పోరులో 3-2తో పాకిస్థాన్ ను అధిగమించింది.

డేవిస్ కప్ చరిత్రలో ఇప్పటి వరకూ పాకిస్థాన్ తో ఆరుసార్లు తలపడిన భారత్…ఆరుకు ఆరుసార్లు విజేతగా నిలిచింది.

First Published:  28 Nov 2019 8:04 PM GMT
Next Story