Telugu Global
CRIME

శంషాబాద్‌లో మ‌రో దారుణం.... మ‌హిళ స‌జీవ‌ద‌హ‌నం !

ప్రియాంక హ‌త్య జ‌రిగి ఒక రోజు కూడా కాలేదు. 24 గంట‌ల్లో మ‌రో మ‌హిళ దారుణ హ‌త్య‌కు గురైంది. శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మహిళ సజీవదహనం వెలుగుచూసింది. ప్రియాంక ఘటన మరువక ముందే మరో మహిళ మృతి కలకలం రేగింది. ప్రియాంక ఘటన పై పోలీసులు ప్రెస్ మీట్ ముగిసిన కొద్ది నిమిషాల్లోనే మరో మహిళ అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. సిద్దలగుట్ట దేవాలయం వద్ద నిర్మానుష్య ప్రదేశం లో 35 ఏళ్ల మహిళ […]

శంషాబాద్‌లో మ‌రో దారుణం.... మ‌హిళ స‌జీవ‌ద‌హ‌నం !
X

ప్రియాంక హ‌త్య జ‌రిగి ఒక రోజు కూడా కాలేదు. 24 గంట‌ల్లో మ‌రో మ‌హిళ దారుణ హ‌త్య‌కు గురైంది. శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మహిళ సజీవదహనం వెలుగుచూసింది. ప్రియాంక ఘటన మరువక ముందే మరో మహిళ మృతి కలకలం రేగింది. ప్రియాంక ఘటన పై పోలీసులు ప్రెస్ మీట్ ముగిసిన కొద్ది నిమిషాల్లోనే మరో మహిళ అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది.

సిద్దలగుట్ట దేవాలయం వద్ద నిర్మానుష్య ప్రదేశం లో 35 ఏళ్ల మహిళ హ‌త్య, స‌జీవ ద‌హ‌నం ఘ‌ట‌న బ‌య‌ట‌ప‌డింది. మహిళ‌దిహత్య నా? ఆత్మహత్య అన్న కోణం లో పోలీసులు విచారణ చేప‌ట్టారు.

దేవాలయం కి పూజ చేసుకోవడానికి వచ్చిన అయ్యప్ప స్వాములు… పక్కనే మహిళ మృతదేహం ప‌డి ఉండ‌డాన్ని గ‌మ‌నించారు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. సంఘ‌ట‌న స్థ‌లం నుంచి మృతురాలు చెప్పులు, బట్టలను క్లూస్ టీమ్ స్వాధీనం చేసుకుంది. టెక్నీకల్ ఏవిడెన్స్ ఆధారంగా పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. 6.30 నుండి 7 గంటలు మధ్యలో ఘ‌ట‌న‌ జరిగి ఉండవచ్చు అని పోలీసుల ప్రాథ‌మిక అంచ‌నా.

First Published:  29 Nov 2019 8:36 PM GMT
Next Story